ETV Bharat / crime

Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగు విధ్వంసం.. రైతు మృతి

author img

By

Published : Mar 31, 2022, 9:06 AM IST

Updated : Mar 31, 2022, 10:03 AM IST

Elephant Attack
Elephant Attack

09:04 March 31

చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో రైతు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో రైతు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. జోగివారిపల్లె పొలంలో నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ఏనుగుల గుంపు పంటపొలాలను ధ్వంసం చేస్తుండటంతో కాపలా కోసం వెళ్లిన రైతు … అక్కడే నిద్రిస్తుండగా గజరాజులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పాపవినాశనం రహదారి వెంట ఏనుగుల సంచారం.. తిరుమల పాపవినాశనం రహదారి వెంట ఏనుగుల మంద సంచారం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం దారిలో తిష్ఠవేసిన ఏనుగులు... తిరుమల ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి. దారిలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై దాడికి యత్నించడంతో వారు తీవ్ర భయాదోంళనకు గురయ్యారు. కొద్దిసేపు రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు తితిదే, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

09:04 March 31

చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో రైతు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో రైతు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. జోగివారిపల్లె పొలంలో నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ఏనుగుల గుంపు పంటపొలాలను ధ్వంసం చేస్తుండటంతో కాపలా కోసం వెళ్లిన రైతు … అక్కడే నిద్రిస్తుండగా గజరాజులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పాపవినాశనం రహదారి వెంట ఏనుగుల సంచారం.. తిరుమల పాపవినాశనం రహదారి వెంట ఏనుగుల మంద సంచారం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం దారిలో తిష్ఠవేసిన ఏనుగులు... తిరుమల ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి. దారిలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై దాడికి యత్నించడంతో వారు తీవ్ర భయాదోంళనకు గురయ్యారు. కొద్దిసేపు రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు తితిదే, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Last Updated : Mar 31, 2022, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.