ETV Bharat / crime

నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్.. మరో నలుగురి కోసం గాలింపు

author img

By

Published : Dec 27, 2022, 5:29 PM IST

Excise department official press meet in Rangareddy district: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కి పోలీసులు తరలించారు. ఇప్పటి వరకు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌​ రవీంద్రరావు తెలిపారు.

Main suspect arrested in fake liquor case
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Excise department official press meet in Rangareddy district: నకిలీ మద్యం కేసు విషయంలో దర్యాప్తు వేగంగా సాగుతోందని.. త్వరలోనే తప్పించుకు తిరుగుతున్న నలుగురిని కూడా అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌​ రవీంద్రరావు తెలిపారు. నిందితులు ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని తెలిపారు. నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు దాదాపు కోటి రూపాయలు విలువైన 20 వేల లీటర్ల నకిలీ విస్కీని పట్టుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్​రెడ్డి అలియాస్​ శివారెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మెుత్తం 15 మందిలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ దాడుల సమయంలో మొత్తం మూడు కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ రవీంద్రరావు తెలిపారు.

"నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడిని పట్టుకున్నాము. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటాము. ఇది రాష్ట్రంలోనే మద్యం విషయంలో పెద్ద కేసు. ఈ కేసులో పాల్గొన్న ప్రతి అధికారిని అభినందిస్తున్నాను. కేసుకు సంబంధించిన ఏవైనా విషయాలు తెలిస్తే తెలియజేయాలని కోరుతున్నాను." _ రవీంద్రరావు, ఎక్సైజ్​ సూపరింటెండెంట్‌

ఇవీ చదవండి:

Excise department official press meet in Rangareddy district: నకిలీ మద్యం కేసు విషయంలో దర్యాప్తు వేగంగా సాగుతోందని.. త్వరలోనే తప్పించుకు తిరుగుతున్న నలుగురిని కూడా అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌​ రవీంద్రరావు తెలిపారు. నిందితులు ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని తెలిపారు. నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు దాదాపు కోటి రూపాయలు విలువైన 20 వేల లీటర్ల నకిలీ విస్కీని పట్టుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్​రెడ్డి అలియాస్​ శివారెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మెుత్తం 15 మందిలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ దాడుల సమయంలో మొత్తం మూడు కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ రవీంద్రరావు తెలిపారు.

"నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడిని పట్టుకున్నాము. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటాము. ఇది రాష్ట్రంలోనే మద్యం విషయంలో పెద్ద కేసు. ఈ కేసులో పాల్గొన్న ప్రతి అధికారిని అభినందిస్తున్నాను. కేసుకు సంబంధించిన ఏవైనా విషయాలు తెలిస్తే తెలియజేయాలని కోరుతున్నాను." _ రవీంద్రరావు, ఎక్సైజ్​ సూపరింటెండెంట్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.