ETV Bharat / crime

ఎలుకలకు పెట్టిన విషపుబియ్యం.. గొర్రెల పాలిట మృత్యుపాశం

author img

By

Published : Dec 24, 2022, 4:19 PM IST

Sheep died in khammam: కొందరు వ్యక్తులు ఆనాలోచితంగా చేసే పనులు ఎన్నో అనర్థాలకు దారి తీస్తాయి. గిడ్డంగులలో ఎలుకల బారి నుంచి సరుకును కాపాడటానికి మందు కలిపిన బియ్యం పెట్టగా, తర్వాత కొన్ని రోజులకు ఆ బియ్యాన్ని రోడ్డు పక్కగా పడేశారు. అటు వైపుగా వెళ్తున్న గొర్రెలు ఆహారంగా తీసుకోవడంతో 10 గొర్రెలు మృత్యవాత పడ్డాయి.

Sheep died in khammam
Sheep died in khammam

Sheep died in khammam: తెలంగాణా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సిబ్బంది చేసిన నిర్వాకానికి 10 మూగ జీవాలు బలైనాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో గిడ్డంగుల సంస్థ సిబ్బంది గిడ్డంగిలో ఉన్న సరుకును ఎలుకలు, పందికొక్కులు నాశనం చేస్తున్నాయని వాటికి మందు కలిపిన బియ్యం పెట్టారు. తదుపరి మిగతా వాటిని రోడ్డు పక్కన పోశారు.

మూగ జీవాలు ఆ బియ్యాన్ని ఆహారంగా భావించి తీసుకోవడంతో వెంటనే 10 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అస్వస్థతకు గురైనాయి. దీంతో గొర్రెల యజమానులు చనిపోయిన గొర్రెలను గిడ్డంగుల సంస్థ ఎదుట పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గొర్రెల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు సుమారు 2 లక్షలు మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు.

Sheep died in khammam: తెలంగాణా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సిబ్బంది చేసిన నిర్వాకానికి 10 మూగ జీవాలు బలైనాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో గిడ్డంగుల సంస్థ సిబ్బంది గిడ్డంగిలో ఉన్న సరుకును ఎలుకలు, పందికొక్కులు నాశనం చేస్తున్నాయని వాటికి మందు కలిపిన బియ్యం పెట్టారు. తదుపరి మిగతా వాటిని రోడ్డు పక్కన పోశారు.

మూగ జీవాలు ఆ బియ్యాన్ని ఆహారంగా భావించి తీసుకోవడంతో వెంటనే 10 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అస్వస్థతకు గురైనాయి. దీంతో గొర్రెల యజమానులు చనిపోయిన గొర్రెలను గిడ్డంగుల సంస్థ ఎదుట పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గొర్రెల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు సుమారు 2 లక్షలు మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.