ఏపీలోని కర్నూలులోని రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎస్ఈబీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 90 లక్షల నగదును బ్యాగుల్లో గుర్తించారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు వీటిని తీసుకెళ్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సొమ్మును స్వాధీనం చేసుకొని తాలూకా పోలీస్ స్టేషన్కు అప్పగించామని వివరించారు.
ఇదీ చూడండి: Kidnap: అడిగిన డబ్బు ఇవ్వకపోతే మన బాబును చంపేస్తా.. చివరికి ఏం జరిగిందంటే !