ETV Bharat / crime

వైద్యుల నిర్లక్ష్యం.. తీసింది పసివాడి ప్రాణం.! - వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి తాజా వార్తలు

పండంటి బిడ్డకు జన్మనిచ్చాననే సంతోషం ఆమెకు ఎంతో కాలం నిల్వలేదు. వైద్యుల నిర్వాకంతో పండంటి మగ బిడ్డకు పదహారు రోజుల్లోనే ఆయుష్షు తీరింది. ముద్దులొలికే చిన్నారిని విగత జీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

Mourning mother
రోదిస్తున్న తల్లి
author img

By

Published : Apr 1, 2022, 4:25 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతో పదహారు రోజుల శిశువు మృతి చెందిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కేశరాజు పల్లి గ్రామానికి దంపతులకు మగ శిశువు జన్మించాడు. అనారోగ్యంతో ఉన్న బాబును బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

శిశువుకు ఊపిరితిత్తుల సమస్య ఉందని గురువారం సాయంత్రం వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత ముక్కు నుంచి రక్తస్రావం జరిగి బాబు మృతి చెందాడు. శిశువు మరణానికి గల కారణమేంటని అడిగితే డాక్టర్లు సమాధానం చెప్పడం లేదని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

వైద్యుల నిర్లక్ష్యంతో పదహారు రోజుల శిశువు మృతి చెందిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కేశరాజు పల్లి గ్రామానికి దంపతులకు మగ శిశువు జన్మించాడు. అనారోగ్యంతో ఉన్న బాబును బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

శిశువుకు ఊపిరితిత్తుల సమస్య ఉందని గురువారం సాయంత్రం వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత ముక్కు నుంచి రక్తస్రావం జరిగి బాబు మృతి చెందాడు. శిశువు మరణానికి గల కారణమేంటని అడిగితే డాక్టర్లు సమాధానం చెప్పడం లేదని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: నిజామాబాద్‌లో ఏడేళ్ల బాలుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.