జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లిలో వెంకట్రావ్ పల్లికి చెందిన ఓ వివాహిత(40)పై జుకల్కు చెందిన బైకగాని లక్ష్మణమూర్తి(50) అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
ఆ మహిళ సరకుల కోసం బస్సులో పరకాలకు బయలుదేరిన క్రమంలో.. రేపాకలో పని నిమిత్తం బస్సు దిగింది. ఆ సమయంలో పరిచయం ఉన్న లక్ష్మణమూర్తి కనిపిచడం వల్ల ఇద్దరు కలిసి బైక్పై రంగయ్యపల్లి వరకు వచ్చారు.
ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించగా ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మహిళకు గాయాలు కావటం వల్ల చికిత్స నిమిత్తం చిట్యాలలోని ఓ ఆసుపత్రికి వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 77 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు