ETV Bharat / crime

ఫ్రెండే కదా అని ఆశ్రయమిస్తే.. ఆ ఫొటోలు తీసి బ్లాక్​మెయిల్..​ చివరకు..! - hyderabad latest crime news

'ట్రెండు మారినా.. ఫ్రెండు మారునా' అంటూ ఓ సినిమా పాటలో స్నేహితుడి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అందరూ​ ఒకేలా ఉండరు కదా. కొంతమంది మనవాడిలాంటోళ్లు కూడా ఉంటారు. ఇతడి వ్యవహారం చూస్తే పాట రాసిన రచయిత కూడా.. 'ట్రెండ్​ మారినా.. కొద్దిమంది ఫ్రెండ్స్​ మారునా' అని తన వాఖ్యాన్ని సరిదిద్దుకుంటాడేమో. అంతలా మనోడు చేసిన పనేంటంటారా..?

ఫ్రెండే కదా అని ఆశ్రయమిస్తే.. ఆ ఫొటోలు తీసి బ్లాక్​మెయిల్..​ చివరకు..!
ఫ్రెండే కదా అని ఆశ్రయమిస్తే.. ఆ ఫొటోలు తీసి బ్లాక్​మెయిల్..​ చివరకు..!
author img

By

Published : Oct 13, 2022, 4:57 PM IST

Updated : Oct 13, 2022, 5:15 PM IST

స్నేహం ముసుగులో మిత్రుడి భార్యను బెదిరించి.. తన కోరిక తీర్చుకునేందుకు యత్నించిన యువకుడిని హైదరాబాద్‌ షీ-బృందం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్​ అనే వ్యక్తికి సల్మాన్‌ అనే స్నేహితుడున్నాడు. వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా అబ్దుల్​ తన ఇంట్లోనే మిత్రుడు సల్మాన్‌కు ఆశ్రయమిచ్చాడు. అయితే సల్మాన్‌ కన్ను మిత్రుడి భార్యపై పడింది. ఈ క్రమంలోనే రహస్య కెమెరా ఏర్పాటు చేసి అబ్దుల్​ తన భార్యతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు సల్మాన్ చిత్రీకరించాడు.

అనంతరం ఆ దృశ్యాలను అబ్దుల్​ భార్యకు చూపి.. తన కోరిక తీర్చమని, లేదంటే చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 8 రోజుల జైలు శిక్ష విధించింది.

ఇవీ చూడండి..

స్నేహం ముసుగులో మిత్రుడి భార్యను బెదిరించి.. తన కోరిక తీర్చుకునేందుకు యత్నించిన యువకుడిని హైదరాబాద్‌ షీ-బృందం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్​ అనే వ్యక్తికి సల్మాన్‌ అనే స్నేహితుడున్నాడు. వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా అబ్దుల్​ తన ఇంట్లోనే మిత్రుడు సల్మాన్‌కు ఆశ్రయమిచ్చాడు. అయితే సల్మాన్‌ కన్ను మిత్రుడి భార్యపై పడింది. ఈ క్రమంలోనే రహస్య కెమెరా ఏర్పాటు చేసి అబ్దుల్​ తన భార్యతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు సల్మాన్ చిత్రీకరించాడు.

అనంతరం ఆ దృశ్యాలను అబ్దుల్​ భార్యకు చూపి.. తన కోరిక తీర్చమని, లేదంటే చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 8 రోజుల జైలు శిక్ష విధించింది.

ఇవీ చూడండి..

అర్చనా నాగ్ సమర్పించు.. "ఊఁ అంటావా లీడర్.. ఊఁ హూ అంటావా?"

ప్రేమించి పెళ్లాడింది.. ఇప్పుడు భర్త గొంతు కోసేసింది.. ఏం జరిగిందంటే..!

ఇంట్లో టీ తాగుతూ కూర్చున్న మైనింగ్ వ్యాపారి దారుణ హత్య

Last Updated : Oct 13, 2022, 5:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.