ETV Bharat / crime

ఏసీబీ వలకు చిక్కిన అబిడ్స్ ఏసీటీవో, ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్ - అనిశా దాడుల్లో చిక్కిన ఏసీటీవో

ఏసీబీ వలకు చిక్కిన అబిడ్స్ ఏసీటీవో, ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్
ఏసీబీ వలకు చిక్కిన అబిడ్స్ ఏసీటీవో, ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్
author img

By

Published : Feb 9, 2021, 10:57 PM IST

Updated : Feb 9, 2021, 11:41 PM IST

22:26 February 09

ఏసీబీ వలకు చిక్కిన అబిడ్స్ ఏసీటీవో, ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్

ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ అబిడ్స్ డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మహమ్మద్ ఆసిఫ్, జూనియర్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్​పెక్టర్​ మహమ్మద్ అష్వక్​లు పనిచేస్తున్నారు. రంజయ్​సింగ్ అనే వ్యక్తికి సంబంధించిన కార్యాలయంలో తనిఖీల సమయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించేందుకు, ఎలాంటి జరిమానాలు విధించకుండా ఉండేందుకు రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు.

లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రంజయ్​సింగ్ అనిశా అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన  అధికారులు అబిడ్స్​లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అష్వక్​లను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40 వేల నగదును సీజ్ చేసిన అనిశా అధికారులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: అటవీ ప్రాంతంలో కారు దగ్ధం.. మిస్టరీ కేసుగా నమోదు!

22:26 February 09

ఏసీబీ వలకు చిక్కిన అబిడ్స్ ఏసీటీవో, ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్

ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ అబిడ్స్ డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మహమ్మద్ ఆసిఫ్, జూనియర్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్​పెక్టర్​ మహమ్మద్ అష్వక్​లు పనిచేస్తున్నారు. రంజయ్​సింగ్ అనే వ్యక్తికి సంబంధించిన కార్యాలయంలో తనిఖీల సమయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించేందుకు, ఎలాంటి జరిమానాలు విధించకుండా ఉండేందుకు రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు.

లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రంజయ్​సింగ్ అనిశా అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన  అధికారులు అబిడ్స్​లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అష్వక్​లను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40 వేల నగదును సీజ్ చేసిన అనిశా అధికారులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: అటవీ ప్రాంతంలో కారు దగ్ధం.. మిస్టరీ కేసుగా నమోదు!

Last Updated : Feb 9, 2021, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.