ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

author img

By

Published : May 7, 2021, 12:41 PM IST

విధులకు హాజరవ్వడం కోసం ద్విచక్రవాహనంపై వెళుతోన్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా చింతకుంటపాలెం మండలంలోని అంజనీ సిమెంట్ ఫాక్టరీ వద్ద జరిగింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

accident in suryapet district
రోడ్టు ప్రమాదంలో వ్యక్తిమృతి

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని అంజనీ సిమెంట్ ఫాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తోన్న రామారావు (25) అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొమ్ముకుంట రామారావు అంజనీ సిమెంట్స్‌ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం ఆఫీస్‌కు రావడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో పులిచింతలకు వెళ్లే మార్గంలో మూలమలుపు వద్ద లారీ అతన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

మూలమలుపు వద్ద దట్టంగా చెట్లు ఉండడంతోనే ఈ జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. సదరు చెట్లను తొలగించాలని యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి: అప్పుడు ప్రమాదం... ఇప్పుడు బలవర్మరణం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని అంజనీ సిమెంట్ ఫాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తోన్న రామారావు (25) అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొమ్ముకుంట రామారావు అంజనీ సిమెంట్స్‌ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం ఆఫీస్‌కు రావడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో పులిచింతలకు వెళ్లే మార్గంలో మూలమలుపు వద్ద లారీ అతన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

మూలమలుపు వద్ద దట్టంగా చెట్లు ఉండడంతోనే ఈ జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. సదరు చెట్లను తొలగించాలని యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి: అప్పుడు ప్రమాదం... ఇప్పుడు బలవర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.