ETV Bharat / crime

మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన షీ-టీమ్​ బృందం

author img

By

Published : Mar 19, 2021, 4:30 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని రైలు పట్టాలపై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన షీ-టీమ్స్​​​ బృందం ఆమెను కాపాడింది.

a women suicide attempt at mahabubabad
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన షీ-టీమ్​ బృందం

మహబూబాబాద్​ పట్టణానికి చెందిన సుజాత భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఇద్దరు కుమారులు డిగ్రీ చదువుతున్నారు. సుజాతకు తన అన్న చేదోడు, వాదోడుగా ఉండేవాడు. ఇటీవల అన్న మరణించాడు. మనస్తాపానికి గురైన సుజాత.. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టణ శివారులోని రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న షీ-టీమ్స్​ బృందం మహిళను రక్షించారు.

మహిళా పోలీస్​ స్టేషన్​ ఎస్సై వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్సై.. బాధిత మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి.. పంపించారు.

ఇదీ చూడండి: గోదావరిలో పడి ముగ్గురు మృతి

మహబూబాబాద్​ పట్టణానికి చెందిన సుజాత భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఇద్దరు కుమారులు డిగ్రీ చదువుతున్నారు. సుజాతకు తన అన్న చేదోడు, వాదోడుగా ఉండేవాడు. ఇటీవల అన్న మరణించాడు. మనస్తాపానికి గురైన సుజాత.. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టణ శివారులోని రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న షీ-టీమ్స్​ బృందం మహిళను రక్షించారు.

మహిళా పోలీస్​ స్టేషన్​ ఎస్సై వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్సై.. బాధిత మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి.. పంపించారు.

ఇదీ చూడండి: గోదావరిలో పడి ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.