ఆన్లైన్ జాబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ పేరుతో మోసానికి పాల్పడ్డారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్లోని బాలానగర్ ఫిరోజ్గూడకు చెందిన సంతోషి కుమారి అనే యువతి ఖాతా నుంచి రూ.17,665 మాయం చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
మోసపోయిందిలా...
ఉద్యోగం మారడానికి గత నెలలో నౌకరి.కామ్లో ఉద్యోగాల కోసం వెతికింది. దీంతో ఆ మహిళకు నౌకరి.కామ్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఫోన్ చేశారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని.. అందుకోసం ఫీజు రూ.25 చెల్లించాలనడంతో సంతోషి కుమారి నమ్మింది. రిజిస్ట్రేషన్ కోసం తన డెబిట్ కార్డు ద్వారా యత్నించగా తన అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించింది.