అమ్మాయి పుట్టిందన్న కారణంతో అత్తమామ, ఆడపడుచుతో సహా భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీలోని గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన పర్వీన్కు 2017లో విశాఖ గంగవరం పోర్టులో పనిచేస్తున్న ఇంజినీర్తో పెద్దలు వివాహం జరిపించారు. తొలి కాన్పులో ఆమెకు అమ్మాయి పుట్టింది. అప్పటి నుంచి భర్తతోపాటు అత్తమామలు తనను వేధిస్తున్నారని గుంటూరు గ్రామీణ ఎస్పీ గ్రీవెన్సు సెల్ను ఆశ్రయించింది.
రెండోసారి ఆడపిల్ల పుట్టకుండా ఫ్యామిలీ ప్రైవేటు డాక్టర్తో రెండుసార్లు ఆబార్షన్ చేయించారని వాపోయింది. తన భర్తపై ఫిర్యాదు చేస్తే పోలీసులు.. ఇంతవరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని పర్వీన్ ఆవేదన వ్యక్తం చేసింది. మామ విశ్రాంత పోలీసు అధికారి కావడమే ఇందుకు కారణమని ఆమె ఆరోపించింది. తన భర్త, అత్తమామల వేధింపుల నుంచి రక్షణ కావాలని ఆమె కోరారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో : కానిస్టేబుల్ను ఢీకొట్టిన బైకర్