ETV Bharat / crime

ఆస్తి వివాదం.. సొంత అన్ననే అతి కిరాతకంగా హతమార్చాడు - నిజామాబాద్​ జిల్లా వార్తలు

ఆస్తి తగాదాలు రక్తసంబంధాలను బలితీసుకుంటున్నాయి. డబ్బు కోసం తోడబుట్టిన వాళ్లనే అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. నిజామాబాద్​ జిల్లా అంబం గ్రామంలో ఆస్తి గొడవల్లో సొంత అన్ననే పొట్టనపెట్టుకున్నాడు ఓ తమ్ముడు.

brother murdered in land disputes
ఆస్తి తగాదాల్లో అన్నను చంపిన తమ్ముడు
author img

By

Published : May 9, 2021, 8:21 AM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో అన్నను సొంత తమ్ముడే అతి కిరాతకంగా చంపాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్​​ ఇటీవలే విదేశాల నుంచి సొంత ఊరికి వచ్చాడు. శుక్రవారం రాత్రి తమ్ముడు నరేందర్​తో ఆస్తి విషయంలో గొడవకు దిగాడు.

ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రం కావడంతో క్షణికావేశానికి గురైన నరేందర్​.. శ్రీనివాస్​ ముఖంపై కర్రతో గాయపరిచాడు. అనంతరం ఛాతీ, గొంతూపై కాలితో తొక్కి హత్య చేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో అన్నను సొంత తమ్ముడే అతి కిరాతకంగా చంపాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్​​ ఇటీవలే విదేశాల నుంచి సొంత ఊరికి వచ్చాడు. శుక్రవారం రాత్రి తమ్ముడు నరేందర్​తో ఆస్తి విషయంలో గొడవకు దిగాడు.

ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రం కావడంతో క్షణికావేశానికి గురైన నరేందర్​.. శ్రీనివాస్​ ముఖంపై కర్రతో గాయపరిచాడు. అనంతరం ఛాతీ, గొంతూపై కాలితో తొక్కి హత్య చేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కాగజ్​నగర్​లో దొంగల చేతివాటం.. ఏడున్నర తులాల బంగారం చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.