హైదరాబాద్లోని మలక్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్ చౌరస్తాలో హాబీబ్ అనే వ్యక్తి పై అతని బావమరిది మోసిన్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాబీబ్ తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మోసిన్ దాడి చేశాడు. సమాచారం అందుకున్న మలక్పేట పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న హాబీబ్ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ తగాదాలే ఈ దాడికి ప్రధాన కారణమని వెల్లడించారు. ప్రస్తుతం హాబీబ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్ పేలి... రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతి