ETV Bharat / crime

Suiside: వాట్సప్​ సూసైడ్ మెసేజ్ పెట్టి వ్యక్తి ఆత్మహత్య..

author img

By

Published : Jun 27, 2021, 12:26 PM IST

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా కుటుంబ సభ్యుల వాట్సా​ప్​ గ్రూప్​లో ఆడియో రికార్డు చేసి పెట్టాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా హాలియాలో జరిగింది.

A Man commits suicide with family quarrels
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా హాలియాలో జరిగింది. మృతుడు చనిపోవడానికి ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నారని కుటుంబ సభ్యుల వాట్సాప్​ గ్రూప్​లో ఆడియో రికార్డు చేసి పెట్టాడు. అనంతరం కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

జిల్లాలోని హాలియాకు చెందిన గుడిపాటి రమేశ్​ హైదరాబాద్​ హస్తినాపురంలోని ఓ రైస్​ మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. భార్య రమ్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మనస్తాపానికి గురైన రమేశ్​ తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు కుటుంబ వాట్సాప్ గ్రూప్​లో ఆడియో రికార్డు చేసి పెట్టాడు. శనివారం తన స్వస్థమైన హాలియాకు వచ్చి సాగర్ కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Murder: భూమి కోసం తండ్రినే కొట్టి చంపిన కొడుకు

కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా హాలియాలో జరిగింది. మృతుడు చనిపోవడానికి ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నారని కుటుంబ సభ్యుల వాట్సాప్​ గ్రూప్​లో ఆడియో రికార్డు చేసి పెట్టాడు. అనంతరం కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

జిల్లాలోని హాలియాకు చెందిన గుడిపాటి రమేశ్​ హైదరాబాద్​ హస్తినాపురంలోని ఓ రైస్​ మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. భార్య రమ్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మనస్తాపానికి గురైన రమేశ్​ తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు కుటుంబ వాట్సాప్ గ్రూప్​లో ఆడియో రికార్డు చేసి పెట్టాడు. శనివారం తన స్వస్థమైన హాలియాకు వచ్చి సాగర్ కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Murder: భూమి కోసం తండ్రినే కొట్టి చంపిన కొడుకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.