స్థలం రాసిస్తానని అతని వద్ద రూ.20 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్లుగా రిజిస్ట్రేషన్ చేస్తానని కాలయాపన చేశాడు. అంతలోనే స్థలం రాసిస్తానని పిలిపించి అతనిపై విచక్షణారహితంగా తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. కరీంనగర్ శివారు రేకుర్తిలో జరిగిన ఈ ఘటనలో బాధితునికి మెడ, చేతి నరాలు తెగి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రున్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రేకుర్తికి చెందిన ఓ విద్యుత్ ఉద్యోగి తన వద్ద తీసుకున్న రూ.20 లక్షలకు తీసుకుని భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని పిలిచి దాడి చేశాడని బాధితుడు ఆరోపించారు. బొమ్మకల్కు చెందిన గోలి శ్రీకాంత్ రేకుర్తికి చెందిన బంగారు మారుతికి రెండేళ్ల క్రితం నుంచి స్థలం రాసివ్వలేదని బాధితుడు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: TRIPLE MURDER: త్రిపుల్ మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్