ETV Bharat / city

'వరంగల్ కార్పొరేషన్​లో నిధులు సరిపడా ఉన్నాయి' - principal secretary arvind kumar on warangal carporation

వరంగల్ కార్పొరేషన్​లో నిధులు సరిపడా ఉన్నాయని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​కుమార్​ పేర్కొన్నారు. ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టు కింద కేంద్రం విడుదల చేసిన 196 కోట్లా 40 లక్షల రూపాయలు వరంగల్ నగరపాలికకు జమ అయ్యాయని పేర్కొన్నారు.

'వరంగల్ కార్పొరేషన్​లో నిధులు సరిపడా ఉన్నాయి'
'వరంగల్ కార్పొరేషన్​లో నిధులు సరిపడా ఉన్నాయి'
author img

By

Published : Jan 6, 2021, 9:39 PM IST

ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నింటినీ వరంగల్ నగరపాలికకు విడుదల చేశామని... మళ్లింపు ఏమాత్రం జరగలేదని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు కింద కేంద్రం విడుదల చేసిన 196 కోట్లా 40 లక్షల రూపాయలు వరంగల్ నగరపాలికకు జమ అయ్యాయని చెప్పారు. మొత్తం 1029 కోట్ల రూపాయల వ్యయంతో 63 పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 46.67 కోట్ల విలువైన పనులు జరగ్గా... 40.67 కోట్ల చెల్లింపులు పూర్తైనట్లు వివరించారు.

వరంగల్ కార్పొరేషన్​లో నిధులు సరిపడా ఉన్నాయని అర్వింద్​కుమార్​ పేర్కొన్నారు. భూసేకరణ, డీపీఆర్ తయారీ తదితరాల వల్ల మొదట్లో పనులు కొంత ఆలస్యమైనా... రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో వేగవంతం అయ్యాయన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులకు అదనంగా ముఖ్యమంత్రి హామీల కింద రూ.109.29 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.72.87 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి విడుదలయ్యాయని ముఖ్యకార్యదర్శి తెలిపారు.

ఇదీ చూడండి: ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపు

ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నింటినీ వరంగల్ నగరపాలికకు విడుదల చేశామని... మళ్లింపు ఏమాత్రం జరగలేదని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు కింద కేంద్రం విడుదల చేసిన 196 కోట్లా 40 లక్షల రూపాయలు వరంగల్ నగరపాలికకు జమ అయ్యాయని చెప్పారు. మొత్తం 1029 కోట్ల రూపాయల వ్యయంతో 63 పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 46.67 కోట్ల విలువైన పనులు జరగ్గా... 40.67 కోట్ల చెల్లింపులు పూర్తైనట్లు వివరించారు.

వరంగల్ కార్పొరేషన్​లో నిధులు సరిపడా ఉన్నాయని అర్వింద్​కుమార్​ పేర్కొన్నారు. భూసేకరణ, డీపీఆర్ తయారీ తదితరాల వల్ల మొదట్లో పనులు కొంత ఆలస్యమైనా... రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో వేగవంతం అయ్యాయన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులకు అదనంగా ముఖ్యమంత్రి హామీల కింద రూ.109.29 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.72.87 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి విడుదలయ్యాయని ముఖ్యకార్యదర్శి తెలిపారు.

ఇదీ చూడండి: ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.