ETV Bharat / city

విధులు బహిష్కరించి.. సింగరేణి కార్మికుల నిరసన - lockdown to be set up in coalmines at singareni

సింగరేణి కార్మికులెవరూ కరోనా బారిన పడకుండా ఉండాలంటే గనుల్లో లాక్​డౌన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం అర్జీ-1 ఏరియాలోని సింగరేణి రెండో బొగ్గు గనిపై సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.

lockdown to be set up in coalmines at singareni
విధులు బహిష్కరించి.. సింగరేణి కార్మికుల నిరసన
author img

By

Published : Jul 21, 2020, 2:30 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా వ్యాప్తితో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కార్మికులకు వైరస్​ సోకి వరుసగా మరణించగా విధులకు హాజరయ్యేందుకు జంకుతున్నారు.

ఈ మేరకు రామగుండం అర్జీ-1 ఏరియాలోని సింగరేణి రెండో బొగ్గు గనిపై సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సింగరేణి యాజమాన్యం వెంటనే లాక్​డౌన్​ ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

మరోవైపు యాజమాన్యం.. కార్మికులకు ఎలాంటి లక్షణాలున్నా విధులకు హాజరు కావద్దని కోరుతున్నారు. హోం క్వారంటైన్​లో ఉన్నవారికి స్పెషల్​ లీవ్ ఇస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని... వైరస్​ కట్టడి కోసం యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టిందని సింగరేణి అధికారులు వివరించారు.

ఇదీ చూడండి:కరోనా ఉద్ధృతికి బ్రెజిల్​లో 80 వేలు దాటిన మరణాలు

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా వ్యాప్తితో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కార్మికులకు వైరస్​ సోకి వరుసగా మరణించగా విధులకు హాజరయ్యేందుకు జంకుతున్నారు.

ఈ మేరకు రామగుండం అర్జీ-1 ఏరియాలోని సింగరేణి రెండో బొగ్గు గనిపై సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సింగరేణి యాజమాన్యం వెంటనే లాక్​డౌన్​ ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

మరోవైపు యాజమాన్యం.. కార్మికులకు ఎలాంటి లక్షణాలున్నా విధులకు హాజరు కావద్దని కోరుతున్నారు. హోం క్వారంటైన్​లో ఉన్నవారికి స్పెషల్​ లీవ్ ఇస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని... వైరస్​ కట్టడి కోసం యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టిందని సింగరేణి అధికారులు వివరించారు.

ఇదీ చూడండి:కరోనా ఉద్ధృతికి బ్రెజిల్​లో 80 వేలు దాటిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.