ETV Bharat / city

పురపాలక సిబ్బందిపై తండ్రీకొడుకుల దాడి

author img

By

Published : Apr 17, 2021, 3:36 PM IST

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి ఒక్కరు మాస్క్​ పెట్టుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది. కానీ మాస్క్​ పెట్టుకోవాలని సూచించినందుకు తండ్రీకుమారుడు కలిసి పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్​లోని గౌతమ్​నగర్​లో జరిగింది.

attack on muncipal staff
పురపాలక సిబ్బందిపై దాడిచేసిన తండ్రీకొడుకు
పురపాలక సిబ్బందిపై దాడిచేసిన తండ్రీకొడుకు

నిజామాబాద్‌లో తండ్రీకుమారుడు రెచ్చిపోయారు. మాస్క్‌ వేసుకోవాలని చెప్పినందుకు పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. గౌతమ్‌నగర్‌లో పురపాలక సిబ్బంది చెత్త సేకరించేందుకు వెళ్లారు. ఓ ఇంటి యజమానికి మాస్క్‌ వేసుకోవాలని సూచించారు.

మంచి విషయం చెప్పినందుకు పాటించాల్సింది పోయి.. తండ్రీకుమారుడు కలిసి పురపాలిక సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడిచేసిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పురపాలక సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: జూన్ వరకూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా చికిత్సపై ఆందోళన వద్దన్న డీహెచ్

పురపాలక సిబ్బందిపై దాడిచేసిన తండ్రీకొడుకు

నిజామాబాద్‌లో తండ్రీకుమారుడు రెచ్చిపోయారు. మాస్క్‌ వేసుకోవాలని చెప్పినందుకు పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. గౌతమ్‌నగర్‌లో పురపాలక సిబ్బంది చెత్త సేకరించేందుకు వెళ్లారు. ఓ ఇంటి యజమానికి మాస్క్‌ వేసుకోవాలని సూచించారు.

మంచి విషయం చెప్పినందుకు పాటించాల్సింది పోయి.. తండ్రీకుమారుడు కలిసి పురపాలిక సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడిచేసిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పురపాలక సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: జూన్ వరకూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా చికిత్సపై ఆందోళన వద్దన్న డీహెచ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.