ETV Bharat / city

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కంచర్ల - సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ తాజా వార్తలు

కోటి 43 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 337 మంది బాధితులకు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందిస్తున్నారని.. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.

mla Kancharla bhupal reddy distributed cm Assistance Fund cheques
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కంచర్ల
author img

By

Published : Dec 6, 2020, 12:08 PM IST

ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే చిన్న వైద్యానికి కూడా లక్షల్లో బిల్లు వేస్తారని.. అదే వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అంత ఖర్చు ఉండదని శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న బాధితులకు నల్గొండ పట్టణంలోని తన పార్టీ క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి కింద 337 మంది బాధితులకు కోటి 43 లక్షల 69వేల 550 రూపాయల విలువ గల చెక్కులను అందించారు. నల్గొండ, తిప్పర్తి, కనగల్ మొదలైన మండలాల్లోని అర్హులైన బాధితులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలా.. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ఆదుకోలేదని పేర్కొన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే చిన్న వైద్యానికి కూడా లక్షల్లో బిల్లు వేస్తారని.. అదే వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అంత ఖర్చు ఉండదని శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న బాధితులకు నల్గొండ పట్టణంలోని తన పార్టీ క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి కింద 337 మంది బాధితులకు కోటి 43 లక్షల 69వేల 550 రూపాయల విలువ గల చెక్కులను అందించారు. నల్గొండ, తిప్పర్తి, కనగల్ మొదలైన మండలాల్లోని అర్హులైన బాధితులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలా.. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ఆదుకోలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఎన్నికల తతంగం.. గంటకో నిర్ణయం.. రోజుకో విధానం.!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.