ఉమ్మడి నల్గొండ జిల్లాలో... తాజాగా 41 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 41 వెలుగు చూడగా... శనివారం కూడా అదే రీతిలో బయటపడ్డాయి. నల్గొండలో 28, సూర్యాపేటలో 7, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 పాజిటివ్గా నిర్ధరణ అయినట్టు... ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మిర్యాలగూడలో 10, దేవరకొండలో 8, నల్గొండలో 6, సూర్యాపేటలో 3, చిట్యాలలో 2... గుడిపల్లి, నార్కట్ పల్లి, మునగాల, గరిడేపల్లి, చివ్వెంల, హుజూర్నగర్ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
దేవరకొండలో రెండేళ్ల చిన్నారి సహా... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా సోకింది. నల్గొండ జిల్లాలో ఒకరు కొవిడ్తో మృతిచెందగా... ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా... 12 మంది మృత్యువాత పడ్డారు. నల్గొండలో 207, సూర్యాపేటలో 166, యాదాద్రిలో 50 మంది... వ్యాధికి గురయ్యారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 28,637 కేసులు.. 551 మరణాలు