ETV Bharat / city

చెన్నూరులో నిరాడంబరంగా వినాయక చవితి ఉత్సవాలు

author img

By

Published : Aug 22, 2020, 2:25 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా భయంతో ప్రజలు ఎవరి ఇళ్లల్లో వారు మట్టితో తయారు చేసుకున్న విగ్రహాలను ప్రతిష్టించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండపాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోగా.. సందడి లేకుండానే పండుగ జరుగుతోంది.

vinayaka chavithi 2020 at chennuru
చెన్నూరులో నిరాడంబరంగా వినాయక చవితి ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా చెన్నూరులో శనివారం నిరాడంబరంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని మందమర్రి, చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం మండలంలోని ప్రజలు గణేశ్​ చతుర్థి వేడుకలను జరుపుకున్నారు.

చాలా మంది మట్టితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వరసిద్ధి వినాయకుని మండపాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల సందడి లేకుండానే పండుగను జరుపుకుంటున్నారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరులో శనివారం నిరాడంబరంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని మందమర్రి, చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం మండలంలోని ప్రజలు గణేశ్​ చతుర్థి వేడుకలను జరుపుకున్నారు.

చాలా మంది మట్టితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వరసిద్ధి వినాయకుని మండపాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల సందడి లేకుండానే పండుగను జరుపుకుంటున్నారు.

ఇదీ చదవండి : శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.