ETV Bharat / city

సర్వాంగసుందరంగా మహబూబ్​నగర్​ పెద్దచెరువు.. డిసెంబర్​లోపు అందుబాటులోకి.. - Mahabubnagar latest news

Mahabubnagar Pedda Cheruvu: మహబూబ్‌నగర్ పెద్దచెరువు.. ఒకప్పుడు కట్టపై జనం రాకపోకలు కూడా సాగించే వాళ్లు కాదు. మురుగునీటితో నిండి ఎప్పుడూ దుర్గందం వెదజల్లేది. గుర్రపుడెక్క పరచుకుని మురికికూపంలా కనిపించేది. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పెద్దచెరువు రూపురేఖలే మారిపోయాయి. పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుని ఆహ్లాదం పంచేందుకు సిద్ధమవుతోంది.

Mahabubnagar Pedda Cheruvu beautified as mini tankbund
Mahabubnagar Pedda Cheruvu beautified as mini tankbund
author img

By

Published : Aug 4, 2022, 4:14 PM IST

Mahabubnagar Pedda Cheruvu: మహబూబ్‌నగర్‌లో పెద్దచెరువు రూపురేఖలు క్రమంగా మారిపోతున్నాయి. సుందరీకరణ పనులు ముమ్మరంగాసాగుతున్నాయి. ఒకప్పుడు ఈ చెరువు కట్ట తుమ్మచెట్లు, ముళ్ల పొదలతో.. జనం సంచరించేందుకు వీలులేకుండా ఉండేది. పాలమూరు పట్టణం నుంచి వచ్చే మురుగునీటితో నిండి దుర్గంధం వెదజల్లేది. ప్రస్తుతం ఈ చెరువును మిని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేశారు. దీన్ని ఆనుకునే హైదరాబాద్ తరహాలో శిల్పారామం నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ వరకు సమయం ఉన్నా అంతకన్నా ముందే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

పట్టణం నుంచి వచ్చే మురుగుతో నిండిన చెరువుని ప్రస్తుతం ఖాళీ చేశారు. మురుగు నీరు చెరువులోకి రాకుండా కాలువల్ని దారి మళ్లించారు. చెరువు మధ్యలో ఎకరా స్థలంలో ఐలాండ్ నిర్మించి... చెరువు కట్టమీద నుంచి తీగల వంతెనను నిర్మించనున్నారు. తీగల వంతెనకు సంబంధించి సివిల్ పనులు పూర్తి కాగా.. తీగల్ని అమర్చి వంతెన పూర్తి చేయాల్సి ఉంది. 14 కోట్లతో చేపట్టిన ఈ పనులు 60శాతం పూర్తయ్యాయి. వంతెన పూర్తైతే మహబూబ్ నగర్ పట్టణానికే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

ప్రస్తుతం చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మిస్తున్నారు. దీనిపై వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. అన్నిపనులు పూర్తైతే పెద్ద చెరువు వద్ద బోటింగ్, లైటింగ్, ఉద్యానవనాలు అందుబాటులోకి రానున్నాయి. పెద్ద చెరువులో జరుగుతున్న పనుల తీరుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దచెరువు చుట్టూ పర్యాటకపరంగా అభివృద్ధి జరుగుతున్నా... చెరువు విస్తీర్ణాన్ని తగ్గించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సర్వాంగసుందరంగా మహబూబ్​నగర్​ పెద్దచెరువు.. డిసెంబర్​లోపు అందుబాటులోకి..

ఇవీ చూడండి:

Mahabubnagar Pedda Cheruvu: మహబూబ్‌నగర్‌లో పెద్దచెరువు రూపురేఖలు క్రమంగా మారిపోతున్నాయి. సుందరీకరణ పనులు ముమ్మరంగాసాగుతున్నాయి. ఒకప్పుడు ఈ చెరువు కట్ట తుమ్మచెట్లు, ముళ్ల పొదలతో.. జనం సంచరించేందుకు వీలులేకుండా ఉండేది. పాలమూరు పట్టణం నుంచి వచ్చే మురుగునీటితో నిండి దుర్గంధం వెదజల్లేది. ప్రస్తుతం ఈ చెరువును మిని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేశారు. దీన్ని ఆనుకునే హైదరాబాద్ తరహాలో శిల్పారామం నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ వరకు సమయం ఉన్నా అంతకన్నా ముందే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

పట్టణం నుంచి వచ్చే మురుగుతో నిండిన చెరువుని ప్రస్తుతం ఖాళీ చేశారు. మురుగు నీరు చెరువులోకి రాకుండా కాలువల్ని దారి మళ్లించారు. చెరువు మధ్యలో ఎకరా స్థలంలో ఐలాండ్ నిర్మించి... చెరువు కట్టమీద నుంచి తీగల వంతెనను నిర్మించనున్నారు. తీగల వంతెనకు సంబంధించి సివిల్ పనులు పూర్తి కాగా.. తీగల్ని అమర్చి వంతెన పూర్తి చేయాల్సి ఉంది. 14 కోట్లతో చేపట్టిన ఈ పనులు 60శాతం పూర్తయ్యాయి. వంతెన పూర్తైతే మహబూబ్ నగర్ పట్టణానికే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

ప్రస్తుతం చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మిస్తున్నారు. దీనిపై వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. అన్నిపనులు పూర్తైతే పెద్ద చెరువు వద్ద బోటింగ్, లైటింగ్, ఉద్యానవనాలు అందుబాటులోకి రానున్నాయి. పెద్ద చెరువులో జరుగుతున్న పనుల తీరుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దచెరువు చుట్టూ పర్యాటకపరంగా అభివృద్ధి జరుగుతున్నా... చెరువు విస్తీర్ణాన్ని తగ్గించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సర్వాంగసుందరంగా మహబూబ్​నగర్​ పెద్దచెరువు.. డిసెంబర్​లోపు అందుబాటులోకి..

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.