మహబూబ్నగర్లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్కు ఓ కుటుంబం అడ్డుపడింది. భూమి కొనుగోలు చేసినప్పటి నుంచి తొమ్మిదేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందన లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చినట్లు తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీర్నపేటలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవం ముగించుకొని కేటీఆర్ తిరుగుపయనమయ్యారు. వీరన్నపేట పాత రైల్వే గేటు దాటిన తర్వాత కుమ్మరివాడికి చెందిన శివశంకర్ తన కుటుంబ సభ్యులతో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి మంత్రి కాన్వాయ్కు అడ్డంగా పడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పక్కకులాగి మంత్రుల కాన్వాయ్కు దారి ఇచ్చారు.
మహబూబ్నగర్ అర్బన్ మండలం పరిధిలోని బండమీదిపల్లి శివారు పరిధిలో ఎకరా భూమి ఉందని బాధితుడు తెలిపారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం జారీచేయాలని అనేక సార్లు అధికారుల చుట్టు తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యలో నలుగురు తహసీల్దార్లు, ఆరుగురు వీఆర్వోలు మారిపోయారని తెలిపారు. కేటీఆర్ దృష్టికి తమ సమస్యను తెలియజేయాలని మంత్రుల కాన్వాయ్కు అడ్డుపడినట్లు తెలిపారు.
ఇవీచూడండి: సచివాలయం కూల్చివేతపై మంత్రివర్గ తీర్మానం ఎక్కడ..: హైకోర్టు