ఇంటర్మీడియట్ ఫలితాలు అవకతవకలపై విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి, డి సి సి ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని నినదించారు. గ్లోబరినా ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇవీ చూడండి: ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర