ETV Bharat / city

రసవత్తరంగా మారుతున్న ఖమ్మం బల్దియా పోరు

author img

By

Published : Dec 30, 2020, 5:05 AM IST

నిర్దేశించిన గడువులోపే ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ... ఖమ్మం బల్దియా పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం 50గా ఉన్న డివిజన్ల సంఖ్యను 60గా పునర్విభజించేందుకు బల్దియా యంత్రాంగం చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సంఘం కదలికలతో నగరపోరుపై పార్టీలన్ని దృష్టిపెట్టాయి.

రసవత్తరంగా మారుతున్న ఖమ్మం బల్దియా పోరు
రసవత్తరంగా మారుతున్న ఖమ్మం బల్దియా పోరు

ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థలతోపాటు మరో నాలుగు పురపాలికలకు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. వార్డుల పునర్విభజనపై పురపాలకశాఖకు లేఖ రాయడంతో... ఖమ్మంలోనూ అధికార యంత్రాంగం సమాయాత్తమవుతోంది. నగరపాలికలో ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా.. కొత్త పురపాలక చట్టం ప్రకారం డివిజన్ల సంఖ్య 60కి పెరగనుంది. ఇప్పటికే అందిన ప్రాథమిక సమాచారంతో డివిజన్లలో ఎంత మేర ఓటర్లు ఉండాలి. పెద్ద డివిజన్లలో ఓటర్ల సంఖ్యను ఎలా తగ్గించాలన్న అంశాలపై కసరత్తు చేసిన అధికారులు..పునర్విభజనపై ఆదేశాలు రాగానే... ప్రక్రియను మరిత ముమ్మరం చేయనున్నారు.

ఎన్నికల భేరికి సై

ఖమ్మం కార్పొరేషన్‌కు 2016 మార్చి 6నఎన్నికలు జరిగితే... మార్చి 15న కొత్త పాలకవర్గం కొలువుదీరింది. 2021 మార్చి 15తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. త్వరలోనే ఎన్నికల నగారా మోగుతుందన్న సమాచారంతో రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల భేరికి సై అంటున్నాయి. గత ఎన్నికల్లో 50 డివిజన్లకు గానూ 34 స్థానాలు గెలుచుకున్న తెరాస.. బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నగరపాలక సంస్థలో ప్రస్తుతం తెరాసకు 42 మంది కార్పొరేటర్ల బలం ఉంది. కాంగ్రెస్ 3, వామపక్షాలు-5, తెలుగుదేశం ఒకటి చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు.

నేతలను రంగంలోకి దించిన తెరాస

బాధ్యతలు చేపట్టాక ఖమ్మంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పువ్వాడ అజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. అభివృద్ధి అజెండాతో ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు తెరాస సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని ముఖ్య నేతలందరినీ రంగంలోకి దించిన తెరాస...ఒక్కో నేతకు ఐదు డివిజన్ల చొప్పున బాధ్యతలు అప్పగిస్తోంది. కొత్తగా మరో 10 డివిజన్లు పెరగనున్నందునఆ ప్రాంతాల్లో అభ్యర్థుల అన్వేషణ చురుగ్గా సాగుతోంది.

విపక్షాలు సైతం

విపక్షాలు సైతం బల్దియా పోరులో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. 50 డివిజన్లకు ఒక్కొక్కరి చొప్పున జిల్లా నేతలను ఇన్‌ఛార్జిలుగా ప్రకటించింది. దుబ్బాక గెలుపు, గ్రేటర్‌లో సత్తా చాటి ఊపుమీదున్న భాజపా సైతం ఈసారి ఖమ్మంపై ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లా, నగర శాఖలకు కొత్త కమిటీలను ప్రకటించి ఎన్నికలకు సమాయత్తమవుతోంది. వామపక్షాలు, తెలుగుదేశం కూడా సత్తా చాటేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఇదీ చదవండి: పల్లె ప్రగతి దేశానికే గర్వకారణం: సీఎం కేసీఆర్

ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థలతోపాటు మరో నాలుగు పురపాలికలకు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. వార్డుల పునర్విభజనపై పురపాలకశాఖకు లేఖ రాయడంతో... ఖమ్మంలోనూ అధికార యంత్రాంగం సమాయాత్తమవుతోంది. నగరపాలికలో ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా.. కొత్త పురపాలక చట్టం ప్రకారం డివిజన్ల సంఖ్య 60కి పెరగనుంది. ఇప్పటికే అందిన ప్రాథమిక సమాచారంతో డివిజన్లలో ఎంత మేర ఓటర్లు ఉండాలి. పెద్ద డివిజన్లలో ఓటర్ల సంఖ్యను ఎలా తగ్గించాలన్న అంశాలపై కసరత్తు చేసిన అధికారులు..పునర్విభజనపై ఆదేశాలు రాగానే... ప్రక్రియను మరిత ముమ్మరం చేయనున్నారు.

ఎన్నికల భేరికి సై

ఖమ్మం కార్పొరేషన్‌కు 2016 మార్చి 6నఎన్నికలు జరిగితే... మార్చి 15న కొత్త పాలకవర్గం కొలువుదీరింది. 2021 మార్చి 15తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. త్వరలోనే ఎన్నికల నగారా మోగుతుందన్న సమాచారంతో రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల భేరికి సై అంటున్నాయి. గత ఎన్నికల్లో 50 డివిజన్లకు గానూ 34 స్థానాలు గెలుచుకున్న తెరాస.. బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నగరపాలక సంస్థలో ప్రస్తుతం తెరాసకు 42 మంది కార్పొరేటర్ల బలం ఉంది. కాంగ్రెస్ 3, వామపక్షాలు-5, తెలుగుదేశం ఒకటి చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు.

నేతలను రంగంలోకి దించిన తెరాస

బాధ్యతలు చేపట్టాక ఖమ్మంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పువ్వాడ అజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. అభివృద్ధి అజెండాతో ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు తెరాస సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని ముఖ్య నేతలందరినీ రంగంలోకి దించిన తెరాస...ఒక్కో నేతకు ఐదు డివిజన్ల చొప్పున బాధ్యతలు అప్పగిస్తోంది. కొత్తగా మరో 10 డివిజన్లు పెరగనున్నందునఆ ప్రాంతాల్లో అభ్యర్థుల అన్వేషణ చురుగ్గా సాగుతోంది.

విపక్షాలు సైతం

విపక్షాలు సైతం బల్దియా పోరులో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. 50 డివిజన్లకు ఒక్కొక్కరి చొప్పున జిల్లా నేతలను ఇన్‌ఛార్జిలుగా ప్రకటించింది. దుబ్బాక గెలుపు, గ్రేటర్‌లో సత్తా చాటి ఊపుమీదున్న భాజపా సైతం ఈసారి ఖమ్మంపై ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లా, నగర శాఖలకు కొత్త కమిటీలను ప్రకటించి ఎన్నికలకు సమాయత్తమవుతోంది. వామపక్షాలు, తెలుగుదేశం కూడా సత్తా చాటేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఇదీ చదవండి: పల్లె ప్రగతి దేశానికే గర్వకారణం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.