ETV Bharat / city

YS SHARMILA: ఏపీ సీఎం జగన్​కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన షర్మిల

author img

By

Published : Aug 22, 2021, 3:15 PM IST

Updated : Aug 22, 2021, 3:34 PM IST

రాఖీపౌర్ణమి సందర్భంగా ఏపీ సీఎం జగన్​ సహా.. పార్టీ కార్యకర్తలు, నేతలకు.. వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని... కార్యకర్తలకు రాఖీలు కట్టారు.

ys sharmila
ys sharmila
వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్​ లోటస్​పాండ్​లోని వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు.. అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి.. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం జగన్​ సహా పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఓ ట్వీట్​ చేశారు.

'నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్​ చేశారు.

నిరుద్యోగుల అంశంపై తమ పార్టీ మొదటి నుంచి దీక్షలు చేస్తోందని, హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో వందకుపైగా నిరుద్యోగ అభ్యర్థులను బరిలో దించుతామని.. ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్​ షర్మిల స్పష్టం చేశారు.

  • నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. #HappyRakhi pic.twitter.com/EP35BVUJ7z

    — YS Sharmila (@realyssharmila) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీచూడండి: RAKHI POURNAMI: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్​ లోటస్​పాండ్​లోని వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు.. అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి.. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం జగన్​ సహా పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఓ ట్వీట్​ చేశారు.

'నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్​ చేశారు.

నిరుద్యోగుల అంశంపై తమ పార్టీ మొదటి నుంచి దీక్షలు చేస్తోందని, హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో వందకుపైగా నిరుద్యోగ అభ్యర్థులను బరిలో దించుతామని.. ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్​ షర్మిల స్పష్టం చేశారు.

  • నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. #HappyRakhi pic.twitter.com/EP35BVUJ7z

    — YS Sharmila (@realyssharmila) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీచూడండి: RAKHI POURNAMI: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

Last Updated : Aug 22, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.