ETV Bharat / city

కరోనా టెస్టులు చేస్తున్న సిబ్బందిపై దాడికి యత్నం - telangana varthalu

హైదరాబాద్​ భోలక్​పూర్​లో కరోనా పరీక్షా కేంద్రాన్ని తరలించాలని స్థానిక యువకులు సిబ్బందిపై దాడికి యత్నించారు. సిబ్బందితో దురుసుగా వ్యవహరించారు. ఈ పరీక్షా కేంద్రం వల్ల తమ బస్తీ ప్రజలకు కరోనా వ్యాపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Corona test center
కరోనా పరీక్షా కేంద్రం సిబ్బందిపై దాడికి యత్నించిన యువకులు
author img

By

Published : Apr 17, 2021, 5:43 PM IST

కరోనా పరీక్షా కేంద్రం సిబ్బందిపై దాడికి యత్నించిన యువకులు

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుండగా... భోలక్​ పూర్​లోని కొందరు యువకులు కరోనా పరీక్షా కేంద్రాన్ని తరలించాలని డిమాండ్ చేయడం అందరినీ తీవ్రంగా కలవరానికి గురిచేస్తోంది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్​పూర్​ రంగానగర్​లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్​లో కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ఏడాదిగా కొనసాగుతున్న ఈ పరీక్ష కేంద్రాన్ని తమ బస్తీ నుంచి తరలించాలని కొందరు యువకులు సిబ్బందిపై దాడికి యత్నించారు. తమ బస్తీలో ఉన్న ఈ పరీక్షా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కరోనా బాధితులు రావడం వల్ల ప్రజలకు కరోనా వ్యాధి సోకుతుందని, కొందరు యువకులు సిబ్బందిపై దురుసుగా వ్యవహరించారు.

ఈ పరీక్షా కేంద్రం వల్ల తమ బస్తీ ప్రజలకు కరోనా వ్యాపిస్తుందని స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరులు కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రానికి రావొద్దని స్థానిక యువకులు కొందరిని భయాందోళనకు గురి చేసి వెనక్కు పంపి వేయిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో స్థానిక యువకులు పారిపోయారు. తాము ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నామని, కానీ స్థానిక యువకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

ఇదీ చదవండి: జూన్ వరకూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా చికిత్సపై ఆందోళన వద్దన్న డీహెచ్

కరోనా పరీక్షా కేంద్రం సిబ్బందిపై దాడికి యత్నించిన యువకులు

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుండగా... భోలక్​ పూర్​లోని కొందరు యువకులు కరోనా పరీక్షా కేంద్రాన్ని తరలించాలని డిమాండ్ చేయడం అందరినీ తీవ్రంగా కలవరానికి గురిచేస్తోంది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్​పూర్​ రంగానగర్​లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్​లో కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ఏడాదిగా కొనసాగుతున్న ఈ పరీక్ష కేంద్రాన్ని తమ బస్తీ నుంచి తరలించాలని కొందరు యువకులు సిబ్బందిపై దాడికి యత్నించారు. తమ బస్తీలో ఉన్న ఈ పరీక్షా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కరోనా బాధితులు రావడం వల్ల ప్రజలకు కరోనా వ్యాధి సోకుతుందని, కొందరు యువకులు సిబ్బందిపై దురుసుగా వ్యవహరించారు.

ఈ పరీక్షా కేంద్రం వల్ల తమ బస్తీ ప్రజలకు కరోనా వ్యాపిస్తుందని స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరులు కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రానికి రావొద్దని స్థానిక యువకులు కొందరిని భయాందోళనకు గురి చేసి వెనక్కు పంపి వేయిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో స్థానిక యువకులు పారిపోయారు. తాము ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నామని, కానీ స్థానిక యువకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

ఇదీ చదవండి: జూన్ వరకూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా చికిత్సపై ఆందోళన వద్దన్న డీహెచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.