ETV Bharat / city

Government hospitals: పేదల ఆస్పత్రుల్లో అధ్వాన పరిస్థితులు.. ఇవిగో సాక్ష్యాలు - telangana government hospital problems

భద్రత ఉండదు.. కనీస సౌకర్యాలు కరవు.. అగ్నిప్రమాద నిరోధక రక్షణా లేదు. ఇదీ మహానగర పరిధిలో కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితి. రెండు రోజుల కిందట గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురైన నేపథ్యంలో సర్కార్‌ దవాఖానాల్లో చికిత్స సంగతి పక్కన పెడితే ఇతర అంశాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర పరిధిలో కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ‘ఈనాడు-ఈటీవీ భారత్​ ప్రతినిధి’ పరిశీలించినప్పుడు అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి.

telangana government hospitals news
telangana government hospitals news
author img

By

Published : Aug 18, 2021, 10:37 AM IST

గాంధీ, ఉస్మానియా పేదల ఆస్పత్రులుగా పేరొందాయి. ఈ రెండు చోట్ల అనధికారిక పడకలతో కలుపుకుంటే నాలుగు వేలు ఉన్నాయి. రోజూ రెండు దవాఖానాలకు దాదాపు ఓపీ విభాగం కింద 2500 మంది రోగులు వచ్చి వైద్య సహాయం పొందుతుంటారు. గాంధీ ఆస్పత్రిలోని ఏ భవనానికీ సరిగా అగ్నిమాపక వ్యవస్థలేదు. ఇటీవలే ఒక వాహనంతో అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేసినా అంత పెద్ద భవనాలకు ఇదొక్కటే సరిపోని పరిస్థితి. అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకు రూ.2 కోట్ల మేర అవుతుందని అంచనా వేసినా కూడా తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ పరిధిలో రూ.15 కోట్ల వరకు ఉన్నా దీనికి మాత్రం నిధులను వ్యయం చేయలేదు. ప్రస్తుతం 189 సీసీ కెమెరాలు ఉండగా అందులో చాలా వరకు పని చేయడం లేదు. విస్తరించిన ఆస్పత్రిలో మరో వంద కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ లేదు. ఏడాదికి రూ.2 కోట్ల వ్యయం అవుతుందని ఈ కాంట్రాక్టును ఎవరికీ ఇవ్వలేదు. గాంధీ ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఆసుపత్రి ప్రధాన భవనం సెల్లార్‌లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నది. అక్కడే రోగులకు అవసరమైన ఆహారం తయారుచేసే వంటశాలతోపాటు పలు విభాగాలు కొనసాగుతుండగా, తరచూ పొంగే డ్రైనేజీ నీటి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోగుల సహాయకుల కోసం ఉండేందుకు వసతి లేక చెట్ల కింద పడిగాపులు పడాల్సి వస్తోంది.

ఉస్మానియా ఆస్పత్రిలో పడకలు లేక కిందే కూర్చొబెట్టి వృద్ధుడికి చికిత్స అందిస్తున్నారిలా

ఉస్మానియాలో పరిస్థితి అంతే!

గాంధీలో కరోనా చికిత్సలు జరుగుతుండటంతో ఉస్మానియాకు రోగులు పోటెత్తుతున్నారు. ఇక్కడికి వచ్చిన రోగులకు పూర్తిగా పడకలు దొరక్క నేలమీదే పడుకుని వైద్యం పొందాల్సి వస్తోంది. ఏడాదిన్నర క్రితం కురిసిన వర్షాల వల్ల పాత భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి వరద చేరింది. రోగులు, వైద్యసిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాత భవనం శిథిలమై, జీర్ణదశకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో గతేడాది జులై నుంచి పాత భవనాన్ని ప్రభుత్వం మూసివేసింది. పెరుగుతున్న రోగుల రద్దీకి అనుగుణంగా ఉస్మానియాలో వార్డులు అందుబాటులో లేకుండా పోయాయి. గత్యంతరం లేని స్థితిలో వైద్య సిబ్బంది రోగులను నేలపైనే పడుకోబెట్టి సేవలు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలై నడవలేని నిస్సహాయ స్థితిలో ఉండే రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఆస్పత్రిలో కూడా అగ్నిమాపక వ్యవస్థ లేదు. రోగుల సహాయకులు ఉండటానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. ఇక్కడ కూడా చాలా వరకు సీసీ కెమెరాలు పని చేయడం లేదు.

పెచ్చులూడుతున్న నిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల వసతిగృహం

కూలకముందే మేల్కోండి…..!

నిమ్స్‌ ఆస్పత్రిలో రోగులే కాకుండా నర్సింగ్‌ సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి నర్సింగ్‌ కళాశాల హాస్టల్‌ శిథిల భవనంలో ఉంది. ఈ భవనాన్ని ఖాళీ చేయాలని ఇటీవల ఇంజనీరింగ్‌ నిపుణులు ఆస్పత్రి అధికారులకు తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో నర్సింగ్‌ కోర్సు చేస్తున్న ఇద్దరు విద్యార్థులు హాస్టల్‌ నుంచి బయటకు వస్తుండగా పైకప్పు పెచ్చులూడి తలపై పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలోనే వైద్యం అందించారు. ఈ విషయం బయటకు రాకుండా పాలనా యంత్రాంగం కప్పిపుచ్చింది. గదులన్నింటికి డోర్‌లు విరిగిపోయాయని విద్యార్థులు వాపోతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే.. భవనం కూలిపోయే ప్రమాదముందని.. అధికారులు అప్రమత్తమై మరో ప్రాంతంలో వసతి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ భవనంలో నర్సింగ్‌ మూడు, నాల్గో సంవత్సరం విద్యార్థులు 200 మంది వరకు వసతి పొందుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొన్ని సమస్యల పరిష్కారంపై దృష్టిసారించింది. రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే సమస్యలన్నింటినీ ప్రణాళికా బద్ధంగా పరిష్కరిస్తాం.

- గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు డా.రాజారావు, డా.నాగేంద్ర

ఇదీచూడండి: GANDHI HOSPITAL RAPE CASE: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అక్కడ ప్రతిదీ అనుమానమే!

గాంధీ, ఉస్మానియా పేదల ఆస్పత్రులుగా పేరొందాయి. ఈ రెండు చోట్ల అనధికారిక పడకలతో కలుపుకుంటే నాలుగు వేలు ఉన్నాయి. రోజూ రెండు దవాఖానాలకు దాదాపు ఓపీ విభాగం కింద 2500 మంది రోగులు వచ్చి వైద్య సహాయం పొందుతుంటారు. గాంధీ ఆస్పత్రిలోని ఏ భవనానికీ సరిగా అగ్నిమాపక వ్యవస్థలేదు. ఇటీవలే ఒక వాహనంతో అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేసినా అంత పెద్ద భవనాలకు ఇదొక్కటే సరిపోని పరిస్థితి. అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకు రూ.2 కోట్ల మేర అవుతుందని అంచనా వేసినా కూడా తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ పరిధిలో రూ.15 కోట్ల వరకు ఉన్నా దీనికి మాత్రం నిధులను వ్యయం చేయలేదు. ప్రస్తుతం 189 సీసీ కెమెరాలు ఉండగా అందులో చాలా వరకు పని చేయడం లేదు. విస్తరించిన ఆస్పత్రిలో మరో వంద కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ లేదు. ఏడాదికి రూ.2 కోట్ల వ్యయం అవుతుందని ఈ కాంట్రాక్టును ఎవరికీ ఇవ్వలేదు. గాంధీ ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఆసుపత్రి ప్రధాన భవనం సెల్లార్‌లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నది. అక్కడే రోగులకు అవసరమైన ఆహారం తయారుచేసే వంటశాలతోపాటు పలు విభాగాలు కొనసాగుతుండగా, తరచూ పొంగే డ్రైనేజీ నీటి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోగుల సహాయకుల కోసం ఉండేందుకు వసతి లేక చెట్ల కింద పడిగాపులు పడాల్సి వస్తోంది.

ఉస్మానియా ఆస్పత్రిలో పడకలు లేక కిందే కూర్చొబెట్టి వృద్ధుడికి చికిత్స అందిస్తున్నారిలా

ఉస్మానియాలో పరిస్థితి అంతే!

గాంధీలో కరోనా చికిత్సలు జరుగుతుండటంతో ఉస్మానియాకు రోగులు పోటెత్తుతున్నారు. ఇక్కడికి వచ్చిన రోగులకు పూర్తిగా పడకలు దొరక్క నేలమీదే పడుకుని వైద్యం పొందాల్సి వస్తోంది. ఏడాదిన్నర క్రితం కురిసిన వర్షాల వల్ల పాత భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి వరద చేరింది. రోగులు, వైద్యసిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాత భవనం శిథిలమై, జీర్ణదశకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో గతేడాది జులై నుంచి పాత భవనాన్ని ప్రభుత్వం మూసివేసింది. పెరుగుతున్న రోగుల రద్దీకి అనుగుణంగా ఉస్మానియాలో వార్డులు అందుబాటులో లేకుండా పోయాయి. గత్యంతరం లేని స్థితిలో వైద్య సిబ్బంది రోగులను నేలపైనే పడుకోబెట్టి సేవలు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలై నడవలేని నిస్సహాయ స్థితిలో ఉండే రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఆస్పత్రిలో కూడా అగ్నిమాపక వ్యవస్థ లేదు. రోగుల సహాయకులు ఉండటానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. ఇక్కడ కూడా చాలా వరకు సీసీ కెమెరాలు పని చేయడం లేదు.

పెచ్చులూడుతున్న నిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల వసతిగృహం

కూలకముందే మేల్కోండి…..!

నిమ్స్‌ ఆస్పత్రిలో రోగులే కాకుండా నర్సింగ్‌ సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి నర్సింగ్‌ కళాశాల హాస్టల్‌ శిథిల భవనంలో ఉంది. ఈ భవనాన్ని ఖాళీ చేయాలని ఇటీవల ఇంజనీరింగ్‌ నిపుణులు ఆస్పత్రి అధికారులకు తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో నర్సింగ్‌ కోర్సు చేస్తున్న ఇద్దరు విద్యార్థులు హాస్టల్‌ నుంచి బయటకు వస్తుండగా పైకప్పు పెచ్చులూడి తలపై పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలోనే వైద్యం అందించారు. ఈ విషయం బయటకు రాకుండా పాలనా యంత్రాంగం కప్పిపుచ్చింది. గదులన్నింటికి డోర్‌లు విరిగిపోయాయని విద్యార్థులు వాపోతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే.. భవనం కూలిపోయే ప్రమాదముందని.. అధికారులు అప్రమత్తమై మరో ప్రాంతంలో వసతి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ భవనంలో నర్సింగ్‌ మూడు, నాల్గో సంవత్సరం విద్యార్థులు 200 మంది వరకు వసతి పొందుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొన్ని సమస్యల పరిష్కారంపై దృష్టిసారించింది. రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే సమస్యలన్నింటినీ ప్రణాళికా బద్ధంగా పరిష్కరిస్తాం.

- గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు డా.రాజారావు, డా.నాగేంద్ర

ఇదీచూడండి: GANDHI HOSPITAL RAPE CASE: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అక్కడ ప్రతిదీ అనుమానమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.