ETV Bharat / city

Parliament on Amaravati : 'అమరావతిని అధికార పార్టీ ఎంపీలే అంగీకరిస్తుంటే ఆందోళన ఎందుకు?'

Venkaiah Naidu on Amaravati : ఏపీ రాజధాని అమరావతిపై రాజ్యసభలో కీలక చర్చ జరిగింది. అమరావతిని అధికార పార్టీ ఎంపీలే అంగీకరిస్తుంటే ఆందోళన ఎందుకని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సభలో రాజధాని అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేవనెత్తగా..ఉపరాష్ట్రపతి కలగజేసుకుని ఈ మేరకు సమాధానమిచ్చారు.

author img

By

Published : Dec 4, 2021, 8:21 AM IST

AP in Parliament, AP MPs in Parliament, parliament sessions, పార్లమెంట్​లో ఏపీ, పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు

Venkaiah Naidu on Amaravati : అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికార వైకాపా ఎంపీలే అంగీకరిస్తుంటే.. ఆందోళన అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రస్తావించారు. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ సభలో ఈ అంశాన్ని లెవనెత్తినప్పుడు ఈ సంభాషణ చోటు చేసుకుంది.

Parliament on Amaravati : ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు తెర మీదకు తెచ్చారంటూ రవీంద్రకుమార్‌ తెలిపారు. ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా అభివృద్ధి పనులకు 15 వేల కోట్లు నిధులు ఇచ్చారని వివరిస్తున్నప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలగచేసుకున్నారు. అధికార పార్టీ నేతలే అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటుంటే మీకు ఆందోళన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి :

telangana in parliament: కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘాల సిఫార్సులను అనుసరించి తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2015 నుంచి ఇప్పటివరకు రూ.8,587.29 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో తెరాస ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

TRS MPs in Parliament Today: ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస ఐదో రోజు లోక్‌సభలో డిమాండ్‌ చేసింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని తెరాస లోకసభాపక్షనేత నామ నాగేశ్వర రావు అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే మాట్లాడేందుకు అవకాశం కల్పించానన్న స్పీకర్‌.... లోక్‌సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

central clarity on paddy procurement : తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. బాయిల్డ్‌ రైస్‌ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ తెరాస సభ్యుడు కె.కేశవరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడానని.. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బాగుందన్న ఆయన.... అదే నమూనాను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బాగుంటుందని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Venkaiah Naidu on Amaravati : అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికార వైకాపా ఎంపీలే అంగీకరిస్తుంటే.. ఆందోళన అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రస్తావించారు. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ సభలో ఈ అంశాన్ని లెవనెత్తినప్పుడు ఈ సంభాషణ చోటు చేసుకుంది.

Parliament on Amaravati : ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు తెర మీదకు తెచ్చారంటూ రవీంద్రకుమార్‌ తెలిపారు. ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా అభివృద్ధి పనులకు 15 వేల కోట్లు నిధులు ఇచ్చారని వివరిస్తున్నప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలగచేసుకున్నారు. అధికార పార్టీ నేతలే అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటుంటే మీకు ఆందోళన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి :

telangana in parliament: కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘాల సిఫార్సులను అనుసరించి తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2015 నుంచి ఇప్పటివరకు రూ.8,587.29 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో తెరాస ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

TRS MPs in Parliament Today: ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస ఐదో రోజు లోక్‌సభలో డిమాండ్‌ చేసింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని తెరాస లోకసభాపక్షనేత నామ నాగేశ్వర రావు అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే మాట్లాడేందుకు అవకాశం కల్పించానన్న స్పీకర్‌.... లోక్‌సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

central clarity on paddy procurement : తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. బాయిల్డ్‌ రైస్‌ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ తెరాస సభ్యుడు కె.కేశవరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడానని.. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బాగుందన్న ఆయన.... అదే నమూనాను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బాగుంటుందని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.