ETV Bharat / city

తితిదే సిబ్బంది, యూపీ నటి మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది..?

author img

By

Published : Sep 5, 2022, 6:44 PM IST

UP Actress Archana Gautham Allegations On TTD: శ్రీవారి బ్రేక్ దర్శనాల కేటాయింపుపై యూపీ నటి అర్చన గౌతమ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. తిరుమల యాత్రలో ఎదుర్కొన్న సంఘటనలను సెల్ఫీ వీడియో తీసుకొని.. దానిని ట్విటర్​లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

అర్చన గౌతమ్
అర్చన గౌతమ్

తితిదే సిబ్బంది, యూపీ నటి మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది..!

UP Actress Archana Gautham Allegations On TTD: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ నటి అర్చన గౌతమ్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అర్చన గౌతమ్.. సిఫారసు లేఖతో బ్రేక్ దర్శనానికి తిరుమల వచ్చారు. బ్రేక్‌ దర్శన సమయం మించిపోవడంతో మరుసటి రోజు రావాలని తితిదే అధికారులు సూచించారు. దీనిపై తితిదే సిబ్బంది, నటి అర్చన గౌతమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే నటి అర్చన గౌతమ్ తిరుమల యాత్రలో తాను ఎదుర్కొన్న సంఘటనలను సెల్ఫీ వీడియో తీసుకొని దానిని ట్విటర్​లో పోస్ట్ చేశారు. రూ.10,500లకు బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తూ.. దోపిడీకి పాల్పడుతున్నారంటూ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఆమె పోస్ట్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’, ‘హసీనా పార్కర్‌’, ‘బారాత్‌ కంపెనీ’ తదితర హిందీ చిత్రాల్లో నటించిన అర్చన తెలుగులో ‘ఐపీఎల్‌: ఇట్స్‌ ప్యూర్‌ లవ్‌’ అనే సినిమా చేశారు. పలు ధారావాహికలు, వీడియో సాంగ్స్‌లోనూ ఆమె మెరిశారు. మోడల్‌ అయిన అర్చన.. 2018లో ‘మిస్‌ బికినీ ఇండియా’ టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మేరఠ్‌లోని హస్తినాపుర్‌ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఇవీ చదవండి: 'భార్యాభర్తలకు ఓకేచోట పోస్టింగ్ ఇవ్వకుంటే.. పిల్లల సంగతేంటి..?'

రాహుల్​ హామీల వర్షం.. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ

తితిదే సిబ్బంది, యూపీ నటి మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది..!

UP Actress Archana Gautham Allegations On TTD: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ నటి అర్చన గౌతమ్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అర్చన గౌతమ్.. సిఫారసు లేఖతో బ్రేక్ దర్శనానికి తిరుమల వచ్చారు. బ్రేక్‌ దర్శన సమయం మించిపోవడంతో మరుసటి రోజు రావాలని తితిదే అధికారులు సూచించారు. దీనిపై తితిదే సిబ్బంది, నటి అర్చన గౌతమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే నటి అర్చన గౌతమ్ తిరుమల యాత్రలో తాను ఎదుర్కొన్న సంఘటనలను సెల్ఫీ వీడియో తీసుకొని దానిని ట్విటర్​లో పోస్ట్ చేశారు. రూ.10,500లకు బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తూ.. దోపిడీకి పాల్పడుతున్నారంటూ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఆమె పోస్ట్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’, ‘హసీనా పార్కర్‌’, ‘బారాత్‌ కంపెనీ’ తదితర హిందీ చిత్రాల్లో నటించిన అర్చన తెలుగులో ‘ఐపీఎల్‌: ఇట్స్‌ ప్యూర్‌ లవ్‌’ అనే సినిమా చేశారు. పలు ధారావాహికలు, వీడియో సాంగ్స్‌లోనూ ఆమె మెరిశారు. మోడల్‌ అయిన అర్చన.. 2018లో ‘మిస్‌ బికినీ ఇండియా’ టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మేరఠ్‌లోని హస్తినాపుర్‌ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఇవీ చదవండి: 'భార్యాభర్తలకు ఓకేచోట పోస్టింగ్ ఇవ్వకుంటే.. పిల్లల సంగతేంటి..?'

రాహుల్​ హామీల వర్షం.. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.