విపక్షాలు ప్రగతి నిరోధకాలుగా మారారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మిమర్శించారు. కాంగ్రెస్ నేతల ఆస్పత్రుల యాత్ర రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెరాస సర్కారు.. విజన్ తో పనిచేస్తుంటే.. విపక్షాలు విధ్వంసం కోసం కంకణం కట్టుకున్నాయన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్, భాజపా తీరు మారాలన్నారు. తెలంగాణ అప్పులు కేంద్రం నిర్దేశించిన పరిమితులకు లోబడే ఉన్నాయన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.