ETV Bharat / city

Revanth: 'అది నీళ్ల లొల్లి కాదు... సురభి నాటకం' - revanth reddy comments on ys sharmila

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదంపై టీపీసీసీ నూతనాధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్​... వైఎస్సార్​ కుటుంబానికి పలు ప్రశ్నలు సంధించారు.

tpcc revanth reddy comments on krishna water dispute
tpcc revanth reddy comments on krishna water dispute
author img

By

Published : Jul 9, 2021, 9:27 PM IST

ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జలాల వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది నీళ్ల లొల్లి కాదని... కేసీఆర్​, జగన్​ ఆడుతున్న సురభి నాటకమని రేవంత్​ ఎద్దేవా చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి డ్రామాలు ఆడుతూ... ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్​రెడ్డి... ఇరు రాష్ట్రాల సీఎంలపై విరుచుకుపడ్డారు. అటు వైఎస్సార్​ కుటుంబానికి సైతం పలు ప్రశ్నలు సంధించారు.

వైఎస్సార్​ చివరి కోరిక అదే...

వైఎస్​ రాజశేఖర్​రెడ్డి అనే మహానేత.. కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని తెలిపారు. తన తండ్రి పేరు ఎఫ్​ఐఆర్​లో కాంగ్రెస్​ పార్టే చేర్చిందంటున్న షర్మిలకు... ఎఫ్​ఐఆర్​లను రాజకీయ పార్టీలు నమోదు చేయవని తెలియదా అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ద్వారా జగన్​ మోహన్ రెడ్డి లబ్ది పొందాడని అప్పట్లోనే కొద్ది మంది కేసులు వేశారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ కారణమని ఆరోజు ఆందోళనలు చేసి.. ఇప్పుడు ఆ సంస్థ వ్యక్తికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వైఎస్సార్​ కుటుంబం... రిలయన్స్ సంస్థకు చెందిన వ్యక్తికి ఎందుకు ఎంపీ అవకాశం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్సార్​ చివరి కోరిక అని.. తండ్రి మీద ప్రేముంటే దాన్ని నెరవేర్చేందుకు ఆ కుటుంబం కృషి చేయాలని రేవంత్​ రెడ్డి సూచించారు.

ఇవీ చూడండి:

ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జలాల వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది నీళ్ల లొల్లి కాదని... కేసీఆర్​, జగన్​ ఆడుతున్న సురభి నాటకమని రేవంత్​ ఎద్దేవా చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి డ్రామాలు ఆడుతూ... ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్​రెడ్డి... ఇరు రాష్ట్రాల సీఎంలపై విరుచుకుపడ్డారు. అటు వైఎస్సార్​ కుటుంబానికి సైతం పలు ప్రశ్నలు సంధించారు.

వైఎస్సార్​ చివరి కోరిక అదే...

వైఎస్​ రాజశేఖర్​రెడ్డి అనే మహానేత.. కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని తెలిపారు. తన తండ్రి పేరు ఎఫ్​ఐఆర్​లో కాంగ్రెస్​ పార్టే చేర్చిందంటున్న షర్మిలకు... ఎఫ్​ఐఆర్​లను రాజకీయ పార్టీలు నమోదు చేయవని తెలియదా అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ద్వారా జగన్​ మోహన్ రెడ్డి లబ్ది పొందాడని అప్పట్లోనే కొద్ది మంది కేసులు వేశారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ కారణమని ఆరోజు ఆందోళనలు చేసి.. ఇప్పుడు ఆ సంస్థ వ్యక్తికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వైఎస్సార్​ కుటుంబం... రిలయన్స్ సంస్థకు చెందిన వ్యక్తికి ఎందుకు ఎంపీ అవకాశం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్సార్​ చివరి కోరిక అని.. తండ్రి మీద ప్రేముంటే దాన్ని నెరవేర్చేందుకు ఆ కుటుంబం కృషి చేయాలని రేవంత్​ రెడ్డి సూచించారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.