ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్​ @5PM

author img

By

Published : Feb 1, 2021, 4:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5PM
టాప్​టెన్​ న్యూస్​ @5PM

1. సంక్షేమమే మా ధ్యేయం

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి క్లస్టర్‌లో నిర్మించిన రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ప్రైవేటు చేతుల్లోకి..

కేంద్ర బడ్జెట్​పై సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా స్పందించారు. లాక్​డౌన్​ తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్​ ప్రజలను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. వాటా తగ్గింది..

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​లో రాష్ట్రానికి పన్నుల వాటా తగ్గింది. గతంతో పోలిస్తే 2 వేల 736 కోట్ల మేర తగ్గిస్తూ.. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఫలితంగా 13వేల 990 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అనుకూలమా? కాదా?

భాజపా నేతలు, కార్యకర్తలపై తెరాసయే దాడులు ప్రారంభంచిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. దాడులకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రామమందిరం నిర్మాణానికి విరాళాల సేకరణలో భక్తులుగా పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సంక్షేమ బడ్డెట్​..!

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్​ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. మౌలిక వసతులు తదితర రంగాలకు వార్షిక పద్దులో పెట్టపీట వేశారు. ఉద్యోగాల సృష్టి, గ్రామీణాభివృద్ధి, భారత్‌లో తయారీ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు​ సెస్​ పేరుతో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచి సామాన్యులపై అదనపు భారం మోపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. చమురు మంట

బడ్జెట్​లో సామాన్యుడిపై పెట్రో వాత పడింది. పెట్రోల్, డీజిల్​పై అగ్రి ఇన్​ఫ్రా సెస్ విధిస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు మరింత పెరగనున్నాయి. అదే సమయంలో మద్యం ఉత్పత్తులపై 100శాతం సెస్​ను విధించనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. లాభాల్లో మార్కెట్లు

బడ్జెట్​ 2021-22 ఇచ్చిన ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు సోమవారం హై జంప్ చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్ల లాభంతో 48,600 మార్క్​ అందుకుంది. నిఫ్టీ 647 పాయింట్లు పెరిగి 14,300లకు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సుంకం తగ్గింపు

దేశీయ పసిడి తయారీదారులకు ప్రోత్సాహం అందించేలా బడ్జెట్​లో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఎగుమతులకు ఊతం అందించేలా చర్యలు చేపట్టింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్లాటినం, విలువైన లోహ నాణేలపైనా కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. చెన్నై టెస్టు ఓ గుణపాఠం

టీమ్​ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్​లో పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని అన్నాడు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్​. లేదంటే అంచనాలు తారుమరయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు. నాలుగేళ్ల క్రితం చిదంబరం స్టేడియంలో భారత్​తో తాము ఆడిన చివరి టెస్టు ఓటమి నుంచి పెద్ద గణపాఠం నేర్చుకున్నామని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'డాక్టర్​ జీ' లో రకుల్

విలక్షణ నటుడు ఆయుష్మాన్​ ఖురానా నటిస్తున్న కొత్త చిత్రం 'డాక్టర్​ జీ'లో రకుల్​ప్రీత్​ సింగ్​ హీరోయిన్​గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. రకుల్​ ఇందులో వైద్య విద్యార్థినిగా కనిపించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. సంక్షేమమే మా ధ్యేయం

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి క్లస్టర్‌లో నిర్మించిన రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ప్రైవేటు చేతుల్లోకి..

కేంద్ర బడ్జెట్​పై సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా స్పందించారు. లాక్​డౌన్​ తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్​ ప్రజలను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. వాటా తగ్గింది..

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​లో రాష్ట్రానికి పన్నుల వాటా తగ్గింది. గతంతో పోలిస్తే 2 వేల 736 కోట్ల మేర తగ్గిస్తూ.. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఫలితంగా 13వేల 990 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అనుకూలమా? కాదా?

భాజపా నేతలు, కార్యకర్తలపై తెరాసయే దాడులు ప్రారంభంచిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. దాడులకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రామమందిరం నిర్మాణానికి విరాళాల సేకరణలో భక్తులుగా పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సంక్షేమ బడ్డెట్​..!

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్​ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. మౌలిక వసతులు తదితర రంగాలకు వార్షిక పద్దులో పెట్టపీట వేశారు. ఉద్యోగాల సృష్టి, గ్రామీణాభివృద్ధి, భారత్‌లో తయారీ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు​ సెస్​ పేరుతో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచి సామాన్యులపై అదనపు భారం మోపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. చమురు మంట

బడ్జెట్​లో సామాన్యుడిపై పెట్రో వాత పడింది. పెట్రోల్, డీజిల్​పై అగ్రి ఇన్​ఫ్రా సెస్ విధిస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు మరింత పెరగనున్నాయి. అదే సమయంలో మద్యం ఉత్పత్తులపై 100శాతం సెస్​ను విధించనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. లాభాల్లో మార్కెట్లు

బడ్జెట్​ 2021-22 ఇచ్చిన ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు సోమవారం హై జంప్ చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్ల లాభంతో 48,600 మార్క్​ అందుకుంది. నిఫ్టీ 647 పాయింట్లు పెరిగి 14,300లకు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సుంకం తగ్గింపు

దేశీయ పసిడి తయారీదారులకు ప్రోత్సాహం అందించేలా బడ్జెట్​లో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఎగుమతులకు ఊతం అందించేలా చర్యలు చేపట్టింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్లాటినం, విలువైన లోహ నాణేలపైనా కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. చెన్నై టెస్టు ఓ గుణపాఠం

టీమ్​ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్​లో పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని అన్నాడు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్​. లేదంటే అంచనాలు తారుమరయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు. నాలుగేళ్ల క్రితం చిదంబరం స్టేడియంలో భారత్​తో తాము ఆడిన చివరి టెస్టు ఓటమి నుంచి పెద్ద గణపాఠం నేర్చుకున్నామని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'డాక్టర్​ జీ' లో రకుల్

విలక్షణ నటుడు ఆయుష్మాన్​ ఖురానా నటిస్తున్న కొత్త చిత్రం 'డాక్టర్​ జీ'లో రకుల్​ప్రీత్​ సింగ్​ హీరోయిన్​గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. రకుల్​ ఇందులో వైద్య విద్యార్థినిగా కనిపించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.