ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jun 30, 2020, 2:58 PM IST

topten news @3pm
టాప్​టెన్​ న్యూస్ @3PM

1. చెప్పేది ఒకటి చేసేది ఒకటి.!

కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కేంద్రం ఓవైపు విశేష ప్రచారం కల్పిస్తోందని.. మరోవైపు ఇందుకు భిన్నంగా చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. మళ్లీ నేపాల్ కవ్వింపులు

భారత సరిహద్దు వెంట కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది పొరుగు దేశం నేపాల్. బిహార్​ పశ్చిమ చంపారన్​ జిల్లా వాల్మీకి నగర్​ వద్దనున్న గండక్ బ్యారెజీ సమీపంలో రెండు క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇటీవల వెనక్కి తగ్గినట్లు కనిపించిన నేపాల్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టడం సరిహద్దు వెంట ఉద్రిక్తతలను పెంచుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. పునః ప్రారంభం

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించే కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయంలో కరోనా పరీక్షలు పునఃప్రాంరంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సామూహిక ఖననం

కరోనా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న వీడియో ఒకటి వైరల్​గా మారింది. అయితే ఇది కర్ణాటక బళ్లారి జిల్లాలో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఫేక్ ట్వీట్

జమ్ము కశ్మీర్, లద్దాఖ్​ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్జాలాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. హోంమంత్రి అమిత్ షా పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ట్వీట్ ఫేక్​ అని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. కొత్త వైరస్

ప్రస్తుతం కరోనా వైరస్​తోనే​ ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో కొత్త వైరస్​ను గుర్తించినట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. మనుషులకు సోకడానికి అవసరమైన లక్షణాలన్నీ ఈ వైరస్​కు ఉన్నట్లు తెలిపారు. మరి ఆ కొత్త వైరస్​ ఏంటో? దానిని ఎలా గుర్తించారో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. చైనా స్పందన

చైనా యాప్​లను భారత్​లో నిషేధించడంపై స్పందించింది ఆ దేశ విదేశాంగ శాఖ. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను భారత్ కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. పాక్ క్రికెటర్లకు కరోనా

కరోనా బారిన పడిన పది మంది పాకిస్థాన్ ఆటగాళ్లలో ఆరుగురికి తాజాగా చేసిన పరీక్షల్లో నెగటివ్​గా నిర్ధరణ అయ్యినట్లు ఆ దేశ క్రికెట్​ బోర్డు ప్రకటించింది. కోలుకున్న వారిని తిరిగి ఇంగ్లాండ్​ పర్యటనకు పంపిస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. క్యాచ్ పడితే అంతే!

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్​ ద్రవిడ్​ బ్యాటింగ్​లోనే కాక ఫీల్డింగ్​లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చేవాడు. ఇతడు పట్టిన క్యాచ్​లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. సర్​ప్రైజ్ గిఫ్ట్

లాక్​డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు సినీతారలు. ఈ ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ లాక్​డౌన్ సమయంలో హీరోయిన్ రష్మిక, మహేశ్ బాబు కుటుంబానికి ఓ సర్​ప్రైజ్ గిఫ్ట్ పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

1. చెప్పేది ఒకటి చేసేది ఒకటి.!

కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కేంద్రం ఓవైపు విశేష ప్రచారం కల్పిస్తోందని.. మరోవైపు ఇందుకు భిన్నంగా చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. మళ్లీ నేపాల్ కవ్వింపులు

భారత సరిహద్దు వెంట కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది పొరుగు దేశం నేపాల్. బిహార్​ పశ్చిమ చంపారన్​ జిల్లా వాల్మీకి నగర్​ వద్దనున్న గండక్ బ్యారెజీ సమీపంలో రెండు క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇటీవల వెనక్కి తగ్గినట్లు కనిపించిన నేపాల్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టడం సరిహద్దు వెంట ఉద్రిక్తతలను పెంచుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. పునః ప్రారంభం

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించే కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయంలో కరోనా పరీక్షలు పునఃప్రాంరంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సామూహిక ఖననం

కరోనా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న వీడియో ఒకటి వైరల్​గా మారింది. అయితే ఇది కర్ణాటక బళ్లారి జిల్లాలో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఫేక్ ట్వీట్

జమ్ము కశ్మీర్, లద్దాఖ్​ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్జాలాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. హోంమంత్రి అమిత్ షా పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ట్వీట్ ఫేక్​ అని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. కొత్త వైరస్

ప్రస్తుతం కరోనా వైరస్​తోనే​ ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో కొత్త వైరస్​ను గుర్తించినట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. మనుషులకు సోకడానికి అవసరమైన లక్షణాలన్నీ ఈ వైరస్​కు ఉన్నట్లు తెలిపారు. మరి ఆ కొత్త వైరస్​ ఏంటో? దానిని ఎలా గుర్తించారో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. చైనా స్పందన

చైనా యాప్​లను భారత్​లో నిషేధించడంపై స్పందించింది ఆ దేశ విదేశాంగ శాఖ. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను భారత్ కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. పాక్ క్రికెటర్లకు కరోనా

కరోనా బారిన పడిన పది మంది పాకిస్థాన్ ఆటగాళ్లలో ఆరుగురికి తాజాగా చేసిన పరీక్షల్లో నెగటివ్​గా నిర్ధరణ అయ్యినట్లు ఆ దేశ క్రికెట్​ బోర్డు ప్రకటించింది. కోలుకున్న వారిని తిరిగి ఇంగ్లాండ్​ పర్యటనకు పంపిస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. క్యాచ్ పడితే అంతే!

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్​ ద్రవిడ్​ బ్యాటింగ్​లోనే కాక ఫీల్డింగ్​లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చేవాడు. ఇతడు పట్టిన క్యాచ్​లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. సర్​ప్రైజ్ గిఫ్ట్

లాక్​డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు సినీతారలు. ఈ ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ లాక్​డౌన్ సమయంలో హీరోయిన్ రష్మిక, మహేశ్ బాబు కుటుంబానికి ఓ సర్​ప్రైజ్ గిఫ్ట్ పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.