ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM - టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS NEWS @9PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM
author img

By

Published : Nov 12, 2020, 8:57 PM IST

  • ఎట్టకేలకు అంగీకరించింది..

ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో తమ దేశానికి చెందిన 11 మంది ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు ఎట్టకేలకు అంగీకరించింది పాకిస్థాన్​. ఈ మేరకు పాక్​ దర్యాప్తు సంస్థ ఎఫ్​ఐఏ హై ప్రోఫైల్​ ఉగ్రవాదుల జాబితాలో వీరి పేర్లను చేర్చింది. అయితే.. ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్​ సయిద్​, మసూద్​ అజార్​, దావూద్​ ఇబ్రహీంల పేర్లు చేర్చకపోవటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అప్పటివరకు పంపిణీ చేయొద్దు..

గిరిజన ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలకు హక్కులు కల్పిస్తూ మెరూన్ పాస్ పుస్తకాలను ఈనెల 19 వరకు పంపిణీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ధ్రువపత్రాల పరిశీలన వాయిదా..

స్టాఫ్ నర్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. రేపటి నుంచి ఈనెల 19 వరకు జరగాల్సిన ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వివరణ ఇవ్వండి..

ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట..

లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ ఎంపీ, ఆర్డీవో ముందే తెరాస, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఒకానొక సమయంలో కుర్చీలు విసురుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వివేకానంద విగ్రహాం ఆవిష్కరణ..

దిల్లీ జేఎన్​యూలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన విగ్రహం ప్రతి ఒక్కరికీ దేశం పట్ల భక్తిని, ప్రేమను నేర్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎన్డీఏ నిర్ణయిస్తుంది..

సీఎం పదవిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు. ఎన్డీఏ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి..

బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 81 రూపాయలు తగ్గింది. వెండి ధర 4 రూపాయలు తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పాండ్యాను అడ్డుకున్న అధికారులు..

ముంబయి ఇండియన్స్​ ఆటగాడు​ క్రునాల్​ పాండ్యాను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటలిజెన్స్​ అధికారులు అడ్డుకున్నారు. అనుమతించిన దానికంటే ఎక్కువ బంగారాన్ని ఆటగాడు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అధికారులు నిలిపేశారని కొన్ని వార్తా నివేదికలు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దీపావళి కానుకగా 'విరహం' ట్రైలర్..

యువ కళాకారులతో సరికొత్త కథాంశంతో రూపొందిన చిత్రం 'విరహం'. ఇటీవలే చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా పోస్టర్​ను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. దీపావళి కానుకగా చిత్ర ట్రైలర్​ను రిలీజ్​ చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎట్టకేలకు అంగీకరించింది..

ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో తమ దేశానికి చెందిన 11 మంది ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు ఎట్టకేలకు అంగీకరించింది పాకిస్థాన్​. ఈ మేరకు పాక్​ దర్యాప్తు సంస్థ ఎఫ్​ఐఏ హై ప్రోఫైల్​ ఉగ్రవాదుల జాబితాలో వీరి పేర్లను చేర్చింది. అయితే.. ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్​ సయిద్​, మసూద్​ అజార్​, దావూద్​ ఇబ్రహీంల పేర్లు చేర్చకపోవటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అప్పటివరకు పంపిణీ చేయొద్దు..

గిరిజన ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలకు హక్కులు కల్పిస్తూ మెరూన్ పాస్ పుస్తకాలను ఈనెల 19 వరకు పంపిణీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ధ్రువపత్రాల పరిశీలన వాయిదా..

స్టాఫ్ నర్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. రేపటి నుంచి ఈనెల 19 వరకు జరగాల్సిన ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వివరణ ఇవ్వండి..

ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట..

లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ ఎంపీ, ఆర్డీవో ముందే తెరాస, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఒకానొక సమయంలో కుర్చీలు విసురుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వివేకానంద విగ్రహాం ఆవిష్కరణ..

దిల్లీ జేఎన్​యూలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన విగ్రహం ప్రతి ఒక్కరికీ దేశం పట్ల భక్తిని, ప్రేమను నేర్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎన్డీఏ నిర్ణయిస్తుంది..

సీఎం పదవిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు. ఎన్డీఏ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి..

బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 81 రూపాయలు తగ్గింది. వెండి ధర 4 రూపాయలు తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పాండ్యాను అడ్డుకున్న అధికారులు..

ముంబయి ఇండియన్స్​ ఆటగాడు​ క్రునాల్​ పాండ్యాను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటలిజెన్స్​ అధికారులు అడ్డుకున్నారు. అనుమతించిన దానికంటే ఎక్కువ బంగారాన్ని ఆటగాడు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అధికారులు నిలిపేశారని కొన్ని వార్తా నివేదికలు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దీపావళి కానుకగా 'విరహం' ట్రైలర్..

యువ కళాకారులతో సరికొత్త కథాంశంతో రూపొందిన చిత్రం 'విరహం'. ఇటీవలే చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా పోస్టర్​ను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. దీపావళి కానుకగా చిత్ర ట్రైలర్​ను రిలీజ్​ చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.