ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM

author img

By

Published : Dec 6, 2020, 9:01 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News in telangana till now
టాప్​టెన్​ న్యూస్​ @9AM
  • రైతు దీక్ష: నడిరోడ్డే వేదిక.. వెనకడుగే లేదిక

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఉపసంహరణే ధ్యేయంగా చెక్కుచెదరని సంకల్పంతో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. కొన్ని నెలలపాటు రోడ్లపైనే బైఠాయించడానికి సిద్ధమై వచ్చిన రైతులు తమ భోజన వసతి వరకు సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. వారు బస చేసినచోట ఉన్న ప్రజలు మానవత్వంతో తమవంతుగా సాయం చేస్తున్నారు. స్థానికులకూ ఆత్మీయత పంచుతున్నారు రైతులు. దిల్లీ-టిక్రీ సరిహద్దును చూస్తే అదే ఒక గ్రామమా అన్నట్లు కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • '1975 ఎమర్జెన్సీ'పై సుప్రీంలో 94 ఏళ్ల వృద్ధురాలి పిటిషన్​

1975లో 'రాజ్యాంగ విరుద్ధంగా' ఎమర్జెన్సీ విధించారని సుప్రీంకోర్టులో ఓ 94 ఏళ్ల వృద్ధురాలు పిటిషన్​ దాఖలు చేశారు. దానివల్ల తమ కుటుంబంలోని మూడు తరాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. పరిహారంగా రూ.25 కోట్లు చెల్లించాలని డిమాండ్​ చేశారు. దీనిపై డిసెంబర్​ 7న విచారణ చేపట్టనుంది అత్యున్నత న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'మూడేళ్లలో 10 లక్షల మందికి ఆన్‌లైన్‌లో పరీక్షలు'

ప్రపంచం ఇప్పుడు ఆన్​లైన్​వైపు చూస్తోంది. కరోనా నేపథ్యంలో ఆన్​లైన్​ తరగతులు నడుస్తున్నాయ్​. పరీక్షలు కూడా ఆన్​లైన్​ ద్వారా నిర్వహించేందుకు సిద్ధమంటున్నారు హైర్​మీ వ్యవస్థాపకుడు చాకో వల్లియప్ప. ఇప్పటికే.. 25 విద్యాసంస్థలు, 100 కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ఈనాడుతో ముఖాముఖిలో కీలక విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే..

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వింత పరిస్థితిని సృష్టించాయి. డిసెంబరు 4న కార్పొరేటర్లుగా గెలిచినప్పటికీ ఆ హోదాలో చలామణి అవలేని పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకమండలి గడువు 2021 ఫిబ్రవరి 11వరకు ఉండటంతో.. గెలిచిన వారు అప్పటి వరకు ప్రమాణ స్వీకారం కోసం వేచి చూడాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేతల్లో కరోనా కలవరం

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతల్లో కొవిడ్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు కరోనా నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కొత్త కార్పొరేటర్లతో నేడు కేటీఆర్​ భేటీ

కొత్తగా ఎన్నికైన పార్టీ కార్పొరేటర్లతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఇవాళ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌ ఇందుకు వేదిక కానుంది. ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎలా మెలగాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు బల్దియా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెరాసలో... మేయర్, ఉపమేయర్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భూమికి చేరుకున్న గ్రహశకల నమూనాలు

సుదూర గ్రహశకల నమూనాలను సేకరించాలన్న జపాన్​ కల నెరవేరింది. తమ​ వ్యోమనౌక హయబూసా-2 జారవడిచిన క్యాప్సూల్ విజయవంతంగా భూమిని చేరుకుంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆస్ట్రేలియాలో ఇది ల్యాండ్​ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఈ మ్యాచ్​ గెలిస్తే సిరీస్​ భారత్​దే

వన్డే సిరీస్‌ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియాపై కోహ్లీసేన బెబ్బులిలా చెలరేగుతోంది. మూడో వన్డే గెలిచి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకొని తొలి టీ20లో విజయ ఢంకా మోగించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ తరుణంలో గెలుపెవరిదన్నది ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'బుమ్రా బౌలింగ్​ రహస్యాన్ని తెలుసుకున్నా'

టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రిత్​ బుమ్రా బౌలింగ్​ రహస్యాన్ని తెలుసుకున్నానని చెప్పాడు ఆస్ట్రేలియా బౌలర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌. ఐపీఎల్​ 13లో అతడి ఆలోచనలను గమనించానని తెలిపాడు. కాగా, బుమ్రా కూడా తన ఆలోచనలను సంతోషంగా తనతో పంచుకున్నట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆకాశవీధిలో అందాల జాబిలి... మహానటి సావిత్రి

అద్భుత నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మహానటి సావిత్రి. భాష ఏదైనా నటనలో ఎదిగి ఒదిగేది. ఎలా బతకాలో చెప్పడానికీ, ఎలా మరణించకూడదో తెలియజేయడానికీ సావిత్రి జీవితం పెద్ద ఉదాహరణ. ఒక ఆదర్శవంతమైన నటిగా, దర్శకురాలిగా అభిమానులు మహానటిగా కీర్తించిన సావిత్రి జయంతి (డిసెంబర్‌ 6) నేడు. ఈ సందర్భంగా ఆమె వెలుగు నీడలు తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రైతు దీక్ష: నడిరోడ్డే వేదిక.. వెనకడుగే లేదిక

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఉపసంహరణే ధ్యేయంగా చెక్కుచెదరని సంకల్పంతో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. కొన్ని నెలలపాటు రోడ్లపైనే బైఠాయించడానికి సిద్ధమై వచ్చిన రైతులు తమ భోజన వసతి వరకు సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. వారు బస చేసినచోట ఉన్న ప్రజలు మానవత్వంతో తమవంతుగా సాయం చేస్తున్నారు. స్థానికులకూ ఆత్మీయత పంచుతున్నారు రైతులు. దిల్లీ-టిక్రీ సరిహద్దును చూస్తే అదే ఒక గ్రామమా అన్నట్లు కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • '1975 ఎమర్జెన్సీ'పై సుప్రీంలో 94 ఏళ్ల వృద్ధురాలి పిటిషన్​

1975లో 'రాజ్యాంగ విరుద్ధంగా' ఎమర్జెన్సీ విధించారని సుప్రీంకోర్టులో ఓ 94 ఏళ్ల వృద్ధురాలు పిటిషన్​ దాఖలు చేశారు. దానివల్ల తమ కుటుంబంలోని మూడు తరాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. పరిహారంగా రూ.25 కోట్లు చెల్లించాలని డిమాండ్​ చేశారు. దీనిపై డిసెంబర్​ 7న విచారణ చేపట్టనుంది అత్యున్నత న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'మూడేళ్లలో 10 లక్షల మందికి ఆన్‌లైన్‌లో పరీక్షలు'

ప్రపంచం ఇప్పుడు ఆన్​లైన్​వైపు చూస్తోంది. కరోనా నేపథ్యంలో ఆన్​లైన్​ తరగతులు నడుస్తున్నాయ్​. పరీక్షలు కూడా ఆన్​లైన్​ ద్వారా నిర్వహించేందుకు సిద్ధమంటున్నారు హైర్​మీ వ్యవస్థాపకుడు చాకో వల్లియప్ప. ఇప్పటికే.. 25 విద్యాసంస్థలు, 100 కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ఈనాడుతో ముఖాముఖిలో కీలక విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే..

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వింత పరిస్థితిని సృష్టించాయి. డిసెంబరు 4న కార్పొరేటర్లుగా గెలిచినప్పటికీ ఆ హోదాలో చలామణి అవలేని పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకమండలి గడువు 2021 ఫిబ్రవరి 11వరకు ఉండటంతో.. గెలిచిన వారు అప్పటి వరకు ప్రమాణ స్వీకారం కోసం వేచి చూడాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేతల్లో కరోనా కలవరం

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతల్లో కొవిడ్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు కరోనా నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కొత్త కార్పొరేటర్లతో నేడు కేటీఆర్​ భేటీ

కొత్తగా ఎన్నికైన పార్టీ కార్పొరేటర్లతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఇవాళ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌ ఇందుకు వేదిక కానుంది. ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎలా మెలగాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు బల్దియా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెరాసలో... మేయర్, ఉపమేయర్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భూమికి చేరుకున్న గ్రహశకల నమూనాలు

సుదూర గ్రహశకల నమూనాలను సేకరించాలన్న జపాన్​ కల నెరవేరింది. తమ​ వ్యోమనౌక హయబూసా-2 జారవడిచిన క్యాప్సూల్ విజయవంతంగా భూమిని చేరుకుంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆస్ట్రేలియాలో ఇది ల్యాండ్​ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఈ మ్యాచ్​ గెలిస్తే సిరీస్​ భారత్​దే

వన్డే సిరీస్‌ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియాపై కోహ్లీసేన బెబ్బులిలా చెలరేగుతోంది. మూడో వన్డే గెలిచి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకొని తొలి టీ20లో విజయ ఢంకా మోగించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ తరుణంలో గెలుపెవరిదన్నది ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'బుమ్రా బౌలింగ్​ రహస్యాన్ని తెలుసుకున్నా'

టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రిత్​ బుమ్రా బౌలింగ్​ రహస్యాన్ని తెలుసుకున్నానని చెప్పాడు ఆస్ట్రేలియా బౌలర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌. ఐపీఎల్​ 13లో అతడి ఆలోచనలను గమనించానని తెలిపాడు. కాగా, బుమ్రా కూడా తన ఆలోచనలను సంతోషంగా తనతో పంచుకున్నట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆకాశవీధిలో అందాల జాబిలి... మహానటి సావిత్రి

అద్భుత నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మహానటి సావిత్రి. భాష ఏదైనా నటనలో ఎదిగి ఒదిగేది. ఎలా బతకాలో చెప్పడానికీ, ఎలా మరణించకూడదో తెలియజేయడానికీ సావిత్రి జీవితం పెద్ద ఉదాహరణ. ఒక ఆదర్శవంతమైన నటిగా, దర్శకురాలిగా అభిమానులు మహానటిగా కీర్తించిన సావిత్రి జయంతి (డిసెంబర్‌ 6) నేడు. ఈ సందర్భంగా ఆమె వెలుగు నీడలు తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.