ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM
author img

By

Published : May 24, 2021, 8:53 PM IST

  • ద్విముఖ వ్యూహం కావాలి..

కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం అమలుచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు. కరోనా పరీక్షలను మరింతగా పెంచాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో 3,043 కరోనా కేసులు..

రాష్ట్రంలో కొత్తగా మరో 3,043 కరోనా కేసులు, 21 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ నుంచి మరో 4,693 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 40,489 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పకడ్బందీగా లాక్‌డౌన్​..

రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్ అమలవుతోంది. నగరాలు, పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మే నెల సాయం విడుదల..

ప్రైవేట్​ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. మే నెలకు 2,04,743 మందికి రూ.40.94 కోట్లు బదిలీ చేసినట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. పాఠశాలలు తెరిచే వరకూ రూ. 2వేల సాయం, ఉచితబియ్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భేటీ వాయిదా..

రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరు కాలేమన్న ఆంధ్రప్రదేశ్ సభ్యుల విజ్ఞప్తితో బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముంచుకొస్తున్న ముప్పు..

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్​ తుపాను.. మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నాయి రాష్ట్రాలు. ఒడిశా బాలాసోర్​ వద్ద తీరం తాకనున్న క్రమంలో అన్ని ఏర్పాట్లు చేపట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ అంశంపై ప్రధాని సమావేశం..

సీబీఐ నూతన డైరెక్టర్​గా ఎవరిని నియమించాలనే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. గతంలో సంస్థ అదనపు డైరెక్టర్​గా పనిచేసిన రాకేశ్ ఆస్థానా సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్విట్టర్​ కార్యాలయాలపై సోదాలు..

దేశ రాజధానిలోని ట్విట్టర్​ కార్యాలయాల్లో దిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రంజీ' పరిహారం ఎప్పుడో?..

కొవిడ్ కారణంగా రద్దైన 2020 రంజీ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐ ప్రకటించిన పరిహారం.. భారత ఫస్ట్​క్లాస్​ క్రికెటర్లకు అందలేదు. రాష్ట్రాల నుంచి అందాల్సిన ప్రణాళిక అందని కారణంగానే చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సారంగదరియా మరో రికార్డు..

'సారంగదరియా' లిరికల్​ వీడియో యూట్యూబ్​లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అతితక్కువ సమయంలోనే 200 మిలియన్​ వ్యూస్​ దక్కించుకున్న తొలి దక్షిణాది పాటగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ద్విముఖ వ్యూహం కావాలి..

కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం అమలుచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు. కరోనా పరీక్షలను మరింతగా పెంచాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో 3,043 కరోనా కేసులు..

రాష్ట్రంలో కొత్తగా మరో 3,043 కరోనా కేసులు, 21 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ నుంచి మరో 4,693 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 40,489 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పకడ్బందీగా లాక్‌డౌన్​..

రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్ అమలవుతోంది. నగరాలు, పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మే నెల సాయం విడుదల..

ప్రైవేట్​ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. మే నెలకు 2,04,743 మందికి రూ.40.94 కోట్లు బదిలీ చేసినట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. పాఠశాలలు తెరిచే వరకూ రూ. 2వేల సాయం, ఉచితబియ్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భేటీ వాయిదా..

రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరు కాలేమన్న ఆంధ్రప్రదేశ్ సభ్యుల విజ్ఞప్తితో బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముంచుకొస్తున్న ముప్పు..

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్​ తుపాను.. మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నాయి రాష్ట్రాలు. ఒడిశా బాలాసోర్​ వద్ద తీరం తాకనున్న క్రమంలో అన్ని ఏర్పాట్లు చేపట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ అంశంపై ప్రధాని సమావేశం..

సీబీఐ నూతన డైరెక్టర్​గా ఎవరిని నియమించాలనే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. గతంలో సంస్థ అదనపు డైరెక్టర్​గా పనిచేసిన రాకేశ్ ఆస్థానా సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్విట్టర్​ కార్యాలయాలపై సోదాలు..

దేశ రాజధానిలోని ట్విట్టర్​ కార్యాలయాల్లో దిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రంజీ' పరిహారం ఎప్పుడో?..

కొవిడ్ కారణంగా రద్దైన 2020 రంజీ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐ ప్రకటించిన పరిహారం.. భారత ఫస్ట్​క్లాస్​ క్రికెటర్లకు అందలేదు. రాష్ట్రాల నుంచి అందాల్సిన ప్రణాళిక అందని కారణంగానే చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సారంగదరియా మరో రికార్డు..

'సారంగదరియా' లిరికల్​ వీడియో యూట్యూబ్​లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అతితక్కువ సమయంలోనే 200 మిలియన్​ వ్యూస్​ దక్కించుకున్న తొలి దక్షిణాది పాటగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.