ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 7 PM

author img

By

Published : Jun 23, 2021, 7:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7 PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7 PM

మరో 5 నెలలు

దీపావళి వరకు ఉచిత రేషన్​ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో ఐదు నెలల పాటు ఉచితంగా రేషన్​ అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ముందే హెచ్చరించాం

తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ సర్కారు సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏడాది కిందటే జీవో తెచ్చినా కేసీఆర్ (Kcr) పట్టించుకోలేదన్నారు. నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

వాటితో ముప్పే.!

నకిలీ విత్తనాల పేరిట మాయాజాలం కొనసాగుతోంది. పెద్దమొత్తంలో విత్తనాలు దొరుకుతున్నాయి కానీ పట్టుబడినవి ఎటువంటివి... ప్రమాదకరమైనవి అందులో ఉంటున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో బీజీ-2 తరహా విత్తనాలకు అనుమతి ఉన్నా... వాటిలో నకిలీవి విపణిలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ నిషేధిత బీజీ-3 విత్తనాలు అడ్డగోలుగా సరఫరా అవుతుండటం విపరిణామాలకు దారితీసే ప్రమాదముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

చిరు ట్వీట్​కు స్పందన

అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలో.. ఏపీ సీఎం జగన్​ను మెగాస్టార్ చిరు పొగుడుతూనే ఉంటారు. దానిపై ఎవరికీ ఏ అభిప్రాయం ఉన్నా... చిరు అభినందనలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈనెల 21న రాష్ట్రంలో సుమారు 13.72 లక్షల మందికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా... టీమ్​ ఏపీ, సీఎం జగన్​కు అభినందనలు తెలుపుతూ.. చిరు ట్వీట్ చేశారు. దానికి ముఖ్యమంత్రి రిప్లయ్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అధికారులకే వెళ్తుందని రీట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

కస్టోడియల్​ డెత్​పై పిల్

ఓ చోరీ కేసులో విచారణకు తీసుకొచ్చిన అనుమానితురాలు అనుమానాస్పద మృతిపై హైకోర్టులో పిల్​ దాఖలైంది. ఈ ఘటనపై జ్యుడిషియల్​ విచారణ కోరుతూ పీయూసీఎల్​ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

గోల్టెన్​ మాస్క్

ఓ వ్యక్తి రూ.5 లక్షలు ఖర్చు చేసి.. బంగారు మాస్క్ చేయించుకున్నారు. ఆ మాస్కుకు స్వయంగా శానిటైజ్​ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అంతేకాదు మూడేళ్లు పాటు వాడుకునే సౌలభ్యం ఉంది. ఈ మాస్క్​తో కలిపి ఆయన వద్ద రెండు కిలోల బంగారం ఉందట. అందుకే ఆయన్ని 'కాన్పుర్​ గోల్డెన్​ బాబా' పిలుస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ఆ గ్రామంలో ఒక్క కేసు రాలేదు

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఏడాదిన్నర కాలంగా వివిధ దశలుగా మారి విజృంభణ కొనసాగిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామాన్ని పలకరించిన మహమ్మారి.. మహారాష్ట్రలోని ఓ గ్రామంలోకి మాత్రం ప్రవేశించలేకపోయింది. అవును.. ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. మరి మహమ్మారిని గ్రామంలోకి రాకుండా ఎలా అడ్డుకున్నారో తెలుసుకుందామా..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

బీడీ కార్మికుల ఆందోళన

పొగాకు ఉత్పత్తులతో కరోనా వ్యాప్తి చెందుతుందా? అనే అంశంపై బాంబే హైకోర్టులో విచారణ నడుస్తున్న నేపథ్యంలో.. బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. మహారాష్టలోని సోలాపుర్​లో బీడీ కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ఈనెల 25 నుంచే.!

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్​ రూ.9,200 కోట్ల బై బ్యాక్​ వివరాలు ప్రకటించింది. నిజానికి ఏప్రిల్​లోనే బై బ్యాక్ ప్రకటించిన ఇన్ఫీ.. తాజాగా వాటాదారుల అనుమతి లభించిన నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడించింది. ఈ నెల 25న బై బ్యాక్​ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

వాట్లింగ్​కు కోహ్లీ అభినందన

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ తర్వాత క్రికెట్ కెరీర్​కు వీడ్కోలు పలుకుతున్న కివీస్ క్రికెటర్​ బీజే వాట్లింగ్​ను.. భారత కెప్టెన్ కోహ్లీ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్​లో పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

మరో 5 నెలలు

దీపావళి వరకు ఉచిత రేషన్​ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో ఐదు నెలల పాటు ఉచితంగా రేషన్​ అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ముందే హెచ్చరించాం

తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ సర్కారు సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏడాది కిందటే జీవో తెచ్చినా కేసీఆర్ (Kcr) పట్టించుకోలేదన్నారు. నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

వాటితో ముప్పే.!

నకిలీ విత్తనాల పేరిట మాయాజాలం కొనసాగుతోంది. పెద్దమొత్తంలో విత్తనాలు దొరుకుతున్నాయి కానీ పట్టుబడినవి ఎటువంటివి... ప్రమాదకరమైనవి అందులో ఉంటున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో బీజీ-2 తరహా విత్తనాలకు అనుమతి ఉన్నా... వాటిలో నకిలీవి విపణిలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ నిషేధిత బీజీ-3 విత్తనాలు అడ్డగోలుగా సరఫరా అవుతుండటం విపరిణామాలకు దారితీసే ప్రమాదముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

చిరు ట్వీట్​కు స్పందన

అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలో.. ఏపీ సీఎం జగన్​ను మెగాస్టార్ చిరు పొగుడుతూనే ఉంటారు. దానిపై ఎవరికీ ఏ అభిప్రాయం ఉన్నా... చిరు అభినందనలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈనెల 21న రాష్ట్రంలో సుమారు 13.72 లక్షల మందికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా... టీమ్​ ఏపీ, సీఎం జగన్​కు అభినందనలు తెలుపుతూ.. చిరు ట్వీట్ చేశారు. దానికి ముఖ్యమంత్రి రిప్లయ్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అధికారులకే వెళ్తుందని రీట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

కస్టోడియల్​ డెత్​పై పిల్

ఓ చోరీ కేసులో విచారణకు తీసుకొచ్చిన అనుమానితురాలు అనుమానాస్పద మృతిపై హైకోర్టులో పిల్​ దాఖలైంది. ఈ ఘటనపై జ్యుడిషియల్​ విచారణ కోరుతూ పీయూసీఎల్​ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

గోల్టెన్​ మాస్క్

ఓ వ్యక్తి రూ.5 లక్షలు ఖర్చు చేసి.. బంగారు మాస్క్ చేయించుకున్నారు. ఆ మాస్కుకు స్వయంగా శానిటైజ్​ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అంతేకాదు మూడేళ్లు పాటు వాడుకునే సౌలభ్యం ఉంది. ఈ మాస్క్​తో కలిపి ఆయన వద్ద రెండు కిలోల బంగారం ఉందట. అందుకే ఆయన్ని 'కాన్పుర్​ గోల్డెన్​ బాబా' పిలుస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ఆ గ్రామంలో ఒక్క కేసు రాలేదు

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఏడాదిన్నర కాలంగా వివిధ దశలుగా మారి విజృంభణ కొనసాగిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామాన్ని పలకరించిన మహమ్మారి.. మహారాష్ట్రలోని ఓ గ్రామంలోకి మాత్రం ప్రవేశించలేకపోయింది. అవును.. ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. మరి మహమ్మారిని గ్రామంలోకి రాకుండా ఎలా అడ్డుకున్నారో తెలుసుకుందామా..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

బీడీ కార్మికుల ఆందోళన

పొగాకు ఉత్పత్తులతో కరోనా వ్యాప్తి చెందుతుందా? అనే అంశంపై బాంబే హైకోర్టులో విచారణ నడుస్తున్న నేపథ్యంలో.. బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. మహారాష్టలోని సోలాపుర్​లో బీడీ కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ఈనెల 25 నుంచే.!

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్​ రూ.9,200 కోట్ల బై బ్యాక్​ వివరాలు ప్రకటించింది. నిజానికి ఏప్రిల్​లోనే బై బ్యాక్ ప్రకటించిన ఇన్ఫీ.. తాజాగా వాటాదారుల అనుమతి లభించిన నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడించింది. ఈ నెల 25న బై బ్యాక్​ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

వాట్లింగ్​కు కోహ్లీ అభినందన

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ తర్వాత క్రికెట్ కెరీర్​కు వీడ్కోలు పలుకుతున్న కివీస్ క్రికెటర్​ బీజే వాట్లింగ్​ను.. భారత కెప్టెన్ కోహ్లీ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్​లో పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.