- కేబినెట్ భేటీ ప్రారంభం..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, సన్నాలు పండించిన రైతులకు బోనస్ ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం దీపావళి శుభాకాంక్షలు..
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానాంధకారాలను తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని ముఖ్యమంత్రి వేడుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుడిలోకి ప్రవేశంలేదు..
ఆధునిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత కాలంలోనూ... కులాల వారిగా నిబంధనలు పెడుతున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న ఈ రోజుల్లో సైతం... కొన్ని కులాల వారిని ఆలయాల్లో ప్రవేశించరాదని ఆపేస్తున్నారు. ఫలానా కులం వారికి దేవాలయాల్లో పూజలు చేయమని నిరాకరిస్తూ... వర్గ విభేదాలు రెచ్చగొడుతున్నారు. ఈ అమానవీయ ఘటన జనగామలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అత్యాధునిక బస్షెల్టర్లు..
హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో నూతనంగా నిర్మించిన ఆరు ఆధునిక బస్షెల్టర్లను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. హైదరాబాద్లో అత్యాధునిక హంగులతో వెయ్యి బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. అత్యాధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా... ప్రముఖ నగరాల్లో మాదిరిగా హైదరాబాదీలకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతోందని మేయర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 6 రాష్ట్రాలకు విపత్తు సాయం..
ప్రకృతి విపత్తులతో తీవ్రంగా నష్టపోయిన ఆరు రాష్ట్రాలకు సాయం కింద త్వరలోనే రూ.4,382 కోట్లు విడుదల చేయనుంది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో బంగాల్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాకిస్థాన్ కాల్పుల్లో ఎస్సై మృతి..
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ మృతి చెందినట్లు భారత ఆర్మీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చేపల దిగుమతులు నిలిపేసిన చైనా..
చేపల్లో కరోనా వైరస్ను గుర్తించటం వల్ల భారత్కు చెందిన బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి దిగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేసింది. గడ్డకట్టింటిన కటిల్ఫిష్ ప్యాకేజీలో మూడు శాంపిల్స్లో వైరస్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని రాయిటర్స్ వార్త సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వారాంతంలో మార్కెట్లకు లాభాలు..
ఆరంభ ఒడుదొడుకుల నుంచి తేరుకుని చివరకు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ స్వల్పంగా 86 పాయింట్లు పెరిగి..43,400పైకి చేరింది. నిఫ్టీ 29 పాయింట్ల స్వల్ప లాభంతో సెషన్ను ముగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అలా చేస్తే బెటర్..
వచ్చే ఐపీఎల్లో ధోనీ, కేవలం ఆటగాడిగానే కొనసాగాలని చెప్పిన మాజీ కోచ్ సంజయ్ బంగర్.. కెప్టెన్సీని వేరే ఆటగాడికి ఇవ్వాలని సూచించాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్-మే మధ్యలో లీగ్ను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అభిమానుల విజిల్స్..
భారత చిత్రసీమలో బయోపిక్లా హవా నడుస్తోంది. సినీ ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఇప్పటివరకు వచ్చిన కొన్ని స్టార్ క్రీడాకారుల బయోపిక్లు ఏంటి? వాటిలో ఎవరు నటించారు? అభిమానుల నుంచి ఎలాంటి స్పందన లభించింది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.