ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

author img

By

Published : May 20, 2021, 10:58 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @11AM
TOP TEN NEWS @11AM
  • మరో 2.76 లక్షల మందికి వైరస్..

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 లక్షల 76 వేల మందికి కొవిడ్​ సోకింది. మరో 3,874 మంది మరణించారు. బుధవారం 20.55 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇకపై ఇంటి వద్దే కరోనా పరీక్షలు!

కరోనా రెండో దశ పల్లెల్లో ఉద్ధృతంగా ఉన్న క్రమంలో ఇంటి వద్దే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​).. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పకడ్బందీగా లాక్​డౌన్..

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు తొమ్మిదో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఓడిన రక్త బంధం..

కొవిడ్‌తో చనిపోయిన ఓ మహిళకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కల్వకుర్తి పట్టణానికి చెందిన ముస్లిం యువకులు. రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు వెనకడుగు వేసిన క్రమంలో.. కులమతాలకు అతీతంగా తామున్నామంటూ ముందుకు వచ్చారు. రక్తబంధం ముందు మానవత్వం గెలిచిందని నిరూపించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా సోకిందా కంగారొద్దు..

కరోనా కాలమిది.. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరి ఇంట్లోకి తొంగి చూస్తుందో.. ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో ఊహించలేని పరిస్థితి..! పొరపాటునో గ్రహపాటునో కరోనా సోకగానే.. చాలా మందిలో మెుగట మెుదలయ్యేది ఆందోళన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ వైరస్​ ప్రమాదకరం కాకపోవచ్చు..

భారత్ లో ఉత్పరివర్తనం చెందిన బి.1.617.2 రకం కొవిడ్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది కాకపోవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ రకం వ్యాప్తిని అరికట్టడంలో టీకాలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయని విశ్లేషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​కు అమెరికా సాయం..

కొవిడ్​పై పోరులో భాగంగా ఇప్పటివరకు భారత్​కు తాము 500 మిలియన్​ డాలర్ల సాయం అందించామని శ్వేతసౌధం తెలిపింది. త్వరలోనే.. వివిధ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు.. భారత్​కు అదనపు సాయం అందించాలని అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒడుదొడుకుల్లో మార్కెట్లు..

అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్​లో లాభాలతో ప్రారంభమై 50 వేల ఎగువకు వెళ్లిన సూచీలు.. క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 98 పాయింట్ల నష్టంతో 49,818 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డబ్ల్యూటీసీ టైటిల్ ఎవరిదంటే..

భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కివీస్​ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్. ఫైనల్​కు ముందు ఇంగ్లాండ్​తో రెండు టెస్టులు ఆడటం కివీస్​కు కలిసొస్తుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆర్​ఆర్​ఆర్ అప్​డేట్​..

నందమూరి అభిమానులకు 'ఆర్​ఆర్​ఆర్' నుంచి​ సర్​ప్రైజ్​ వచ్చేసింది. యంగ్​టైగర్​ ఎన్టీఆర్​​ పుట్టినరోజు సందర్భంగా ఈ​ చిత్రంలోని ఆయన నయా అవతార్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది అభిమానులను అలరించేలా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో 2.76 లక్షల మందికి వైరస్..

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 లక్షల 76 వేల మందికి కొవిడ్​ సోకింది. మరో 3,874 మంది మరణించారు. బుధవారం 20.55 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇకపై ఇంటి వద్దే కరోనా పరీక్షలు!

కరోనా రెండో దశ పల్లెల్లో ఉద్ధృతంగా ఉన్న క్రమంలో ఇంటి వద్దే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​).. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పకడ్బందీగా లాక్​డౌన్..

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు తొమ్మిదో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఓడిన రక్త బంధం..

కొవిడ్‌తో చనిపోయిన ఓ మహిళకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కల్వకుర్తి పట్టణానికి చెందిన ముస్లిం యువకులు. రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు వెనకడుగు వేసిన క్రమంలో.. కులమతాలకు అతీతంగా తామున్నామంటూ ముందుకు వచ్చారు. రక్తబంధం ముందు మానవత్వం గెలిచిందని నిరూపించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా సోకిందా కంగారొద్దు..

కరోనా కాలమిది.. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరి ఇంట్లోకి తొంగి చూస్తుందో.. ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో ఊహించలేని పరిస్థితి..! పొరపాటునో గ్రహపాటునో కరోనా సోకగానే.. చాలా మందిలో మెుగట మెుదలయ్యేది ఆందోళన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ వైరస్​ ప్రమాదకరం కాకపోవచ్చు..

భారత్ లో ఉత్పరివర్తనం చెందిన బి.1.617.2 రకం కొవిడ్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది కాకపోవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ రకం వ్యాప్తిని అరికట్టడంలో టీకాలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయని విశ్లేషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​కు అమెరికా సాయం..

కొవిడ్​పై పోరులో భాగంగా ఇప్పటివరకు భారత్​కు తాము 500 మిలియన్​ డాలర్ల సాయం అందించామని శ్వేతసౌధం తెలిపింది. త్వరలోనే.. వివిధ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు.. భారత్​కు అదనపు సాయం అందించాలని అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒడుదొడుకుల్లో మార్కెట్లు..

అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్​లో లాభాలతో ప్రారంభమై 50 వేల ఎగువకు వెళ్లిన సూచీలు.. క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 98 పాయింట్ల నష్టంతో 49,818 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డబ్ల్యూటీసీ టైటిల్ ఎవరిదంటే..

భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కివీస్​ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్. ఫైనల్​కు ముందు ఇంగ్లాండ్​తో రెండు టెస్టులు ఆడటం కివీస్​కు కలిసొస్తుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆర్​ఆర్​ఆర్ అప్​డేట్​..

నందమూరి అభిమానులకు 'ఆర్​ఆర్​ఆర్' నుంచి​ సర్​ప్రైజ్​ వచ్చేసింది. యంగ్​టైగర్​ ఎన్టీఆర్​​ పుట్టినరోజు సందర్భంగా ఈ​ చిత్రంలోని ఆయన నయా అవతార్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది అభిమానులను అలరించేలా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.