ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​: శ్రీవారి దర్శనం టికెట్లు రద్దుకు అవకాశం - తిరుమలలో కరోనా ఎఫెక్ట్

కరోనా దృష్ట్యా తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం టికెట్లు బుక్​ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అన్నిచోట్లా రసాయనాలతో నిత్యం శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమలకు రావద్దని సూచించారు.

ttd
ttd
author img

By

Published : Mar 10, 2020, 11:10 PM IST

కరోనా ఎఫెక్ట్​: శ్రీవారి దర్శనం టికెట్లు రద్దుకు అవకాశం

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా టికెట్లు బుక్​ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని సూచించారు. తిరుమలలో అన్నిచోట్లా రసాయనాలతో నిత్యం శుభ్రపరిచేలా చర్యల చేపడుతున్నట్లు వివరించారు. భక్తులను పరీక్షించేందుకు థర్మల్‌ గన్స్ వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15 నుంచి వసతి గదులకు కాషన్ డిపాజిట్‌ అమలు చేస్తామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

అడ్వాన్స్​ బుకింగ్​ కోటా 50 శాతానికి తగ్గింపు

మే, జూన్‌లో అడ్వాన్స్ బుకింగ్‌ కోటా 50 శాతానికి తగ్గిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. కరెంట్ బుకింగ్ కింద ఎక్కువ గదులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. శేషాచలం కొండల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. తిరుమలలో తాగునీటి కోసం 150 చోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణలో కరోనా లేదు: ఈటల

కరోనా ఎఫెక్ట్​: శ్రీవారి దర్శనం టికెట్లు రద్దుకు అవకాశం

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా టికెట్లు బుక్​ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని సూచించారు. తిరుమలలో అన్నిచోట్లా రసాయనాలతో నిత్యం శుభ్రపరిచేలా చర్యల చేపడుతున్నట్లు వివరించారు. భక్తులను పరీక్షించేందుకు థర్మల్‌ గన్స్ వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15 నుంచి వసతి గదులకు కాషన్ డిపాజిట్‌ అమలు చేస్తామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

అడ్వాన్స్​ బుకింగ్​ కోటా 50 శాతానికి తగ్గింపు

మే, జూన్‌లో అడ్వాన్స్ బుకింగ్‌ కోటా 50 శాతానికి తగ్గిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. కరెంట్ బుకింగ్ కింద ఎక్కువ గదులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. శేషాచలం కొండల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. తిరుమలలో తాగునీటి కోసం 150 చోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణలో కరోనా లేదు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.