ETV Bharat / city

మల్కన్​గిరి ఎస్పీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు

author img

By

Published : Mar 31, 2021, 11:01 PM IST

ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దు ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీలో కీల‌కంగా వ్య‌వ‌హరిస్తున్న ముగ్గురు కీల‌క‌మైన మావోయిస్టులు.. ఏవోబీలోని మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి ముందు లొంగిపోయారు.

maoists
లొంగిపోయిన మావోయిస్టులు

ఏవోబీలో ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీలో కీల‌కంగా వ్య‌వ‌హరిస్తున్న ముగ్గురు మావోయిస్టులు.. ఒడిశా పరిధిలోని మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి ముందు లొంగిపోయారు. ఏవోబీ ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ మిల‌టరీ ప్లాటూన్ ఏరియా క‌మిటీ స‌భ్యులు మ‌యినూ అలియాస్ సంబూ, ర‌మా అప్కా, ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీలోని గుమ్మ ఏరియా క‌మిటీ స‌భ్యుడు ర‌ఘు ఖ‌రాలు.. వీరిలో ఉన్నారు.

మెుదటి ఇద్దరు ఛ‌త్తీస్​గఢ్ ​లోని బీజ్‌పూర్ జిల్లాకు చెందిన వారు. వీరు 2009 నుంచి నిషేధిత మావోయిస్టు పార్టీలో ఉన్నారు. వీరిపై నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌లు రివార్డు ఉంది. మ‌ల్క‌న్‌గిరి జిల్లా బెజ్జింగి గ్రామానికి చెందిన ర‌ఘు ఖ‌రా గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా మావోయిస్టు పార్టీలో ప‌నిచేస్తున్నారు. ఇత‌నిపై ల‌క్ష రూపాయల రివార్డు ఉంది.

తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగటంతో శాంతి వైపు మెుగ్గు చూపుతున్నట్లు, మావోల వేధింపులతో లొంగుబాటుకు నిర్ణ‌యించుకున్నారని ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల‌ను పూర్తిస్థాయిలో ఆదుకుంటామ‌ని చెప్పారు.

ఇదీ చదవండి: 'జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది'

ఏవోబీలో ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీలో కీల‌కంగా వ్య‌వ‌హరిస్తున్న ముగ్గురు మావోయిస్టులు.. ఒడిశా పరిధిలోని మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి ముందు లొంగిపోయారు. ఏవోబీ ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ మిల‌టరీ ప్లాటూన్ ఏరియా క‌మిటీ స‌భ్యులు మ‌యినూ అలియాస్ సంబూ, ర‌మా అప్కా, ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీలోని గుమ్మ ఏరియా క‌మిటీ స‌భ్యుడు ర‌ఘు ఖ‌రాలు.. వీరిలో ఉన్నారు.

మెుదటి ఇద్దరు ఛ‌త్తీస్​గఢ్ ​లోని బీజ్‌పూర్ జిల్లాకు చెందిన వారు. వీరు 2009 నుంచి నిషేధిత మావోయిస్టు పార్టీలో ఉన్నారు. వీరిపై నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌లు రివార్డు ఉంది. మ‌ల్క‌న్‌గిరి జిల్లా బెజ్జింగి గ్రామానికి చెందిన ర‌ఘు ఖ‌రా గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా మావోయిస్టు పార్టీలో ప‌నిచేస్తున్నారు. ఇత‌నిపై ల‌క్ష రూపాయల రివార్డు ఉంది.

తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగటంతో శాంతి వైపు మెుగ్గు చూపుతున్నట్లు, మావోల వేధింపులతో లొంగుబాటుకు నిర్ణ‌యించుకున్నారని ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల‌ను పూర్తిస్థాయిలో ఆదుకుంటామ‌ని చెప్పారు.

ఇదీ చదవండి: 'జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.