ETV Bharat / city

Telangana News : టాప్​న్యూస్ @7PM

author img

By

Published : Jul 27, 2022, 6:58 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

ప్రాణాలకు తెగించి.. పీకల్లోతు నీటిలో దూకి మునిగిపోతున్న వ్యక్తిని కాపాడాడు ఎస్‌ఐ. ఈ ఘటన హైదరాబాద్ జియాగూడ వద్ద చోటుచేసుకుంది. ఇది చూసిన ప్రజలు ఎస్‌ఐను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

  • జంట జలాశయాలకు భారీవరద..

హైదరాబాద్​లో మూసీ పరివాహక ప్రాంతమైన నయాపూల్​ను వరద ముంచెత్తింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నుంచి భారీగా నీరు దిగువకు విడుదల చేయడంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలసంద్రంగా మారాయి.

  • ఎమ్మెల్యే రాజాసింగ్ అలక

సంచలనాత్మక, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​.. ఇప్పుడు అలక మంచం ఎక్కారు. తెరాస నేతలపై విమర్శలు, కేటీఆర్​పై సెటైర్లు, బుల్డోజర్ల కామెంట్లతో హల్​చల్​ చేసే.. రాజాసింగ్​ అలకకు కారణమేంటీ.. అసలు ఆ అలక ఎవరి మీద అనుకుంటున్నారా..?

  • ఇంటి కింద పది కోట్లు..

నక్సలైట్ల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 11మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.10కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ బాలాఘాట్​లో జరిగింది. మరో ఘటనలో ఖాండ్వా జిల్లాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

  • రైల్వేలో 'వృద్ధుల రాయితీ' పునరుద్ధరణ..

వయోవృద్ధుల రాయితీని పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనరల్‌, స్లీపర్‌ తరగతులకే రాయితీని పరిమితం చేసే ఆలోచన ఉన్నట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. 70ఏళ్లు పైబడిన వారికే రాయితీ ఇచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి.

  • లాక్​డౌన్​లో బోర్ కొట్టి విమానం తయార్..

పైలట్‌ లైసెన్స్‌ కలిగిన అశోక్‌ గతంలో టూ సీటర్‌ విమానాలను అద్దెకు తీసుకొని అందులో విహారయాత్రలు చేసేవాడు. వివాహం, అనంతరం ఇద్దరు కుమార్తెలు కలగడంతో ఆయనకు నాలుగు సీట్ల విమానం అవసరమయ్యింది. ఈ విమానాలు అద్దెకు అరుదుగా లభిస్తుండటం, అవీ పాతవి కావడంతో తానే ఓ ఫోర్‌ సీటర్‌ విమానాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇందుకు లాక్‌డౌన్‌ కాలం కలిసొచ్చింది.

  • ఐసీసీ కొత్త ఛైర్మన్​గా దాదా ఎంపిక ఖరారైనట్లేనా?

ఐసీసీ కొత్త ఛైర్మన్​గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా బోర్డు స్పందించలేదు.

  • 'బింబిసార' కొత్త ట్రైలర్‌.. కల్యాణ్​ రామ్​ అదరగొట్టేశాడుగా

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్​ నటించిన 'బింబిసార' కొత్త ట్రైలర్​ వచ్చేసింది. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

  • పుతిన్​కు తీవ్ర అస్వస్థత.. వైద్యుల్లో టెన్షన్​ టెన్షన్​!

రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పారామెడికల్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఆయన గదికి చేరుకున్న వైద్యులు మూడు గంటలపాటు చికిత్స అందించినట్లు సమాచారం.

  • బంగాల్​లోనూ 'ఆపరేషన్​ శిందే!'..

బంగాల్​ రాజకీయం కీలక మలుపు తిరగనుందా? మహారాష్ట్ర తరహా పరిణామాలకు వేదిక కానుందా? ఔననే అంటున్నారు నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి. టీఎంసీ మాత్రం ఆయన వాదనల్ని కొట్టిపారేసింది.

  • హ్యాట్సాఫ్ పోలీస్.. వరదనీటిలో దూకి వ్యక్తిని కాపాడిన ఎస్​ఐ

ప్రాణాలకు తెగించి.. పీకల్లోతు నీటిలో దూకి మునిగిపోతున్న వ్యక్తిని కాపాడాడు ఎస్‌ఐ. ఈ ఘటన హైదరాబాద్ జియాగూడ వద్ద చోటుచేసుకుంది. ఇది చూసిన ప్రజలు ఎస్‌ఐను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

  • జంట జలాశయాలకు భారీవరద..

హైదరాబాద్​లో మూసీ పరివాహక ప్రాంతమైన నయాపూల్​ను వరద ముంచెత్తింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నుంచి భారీగా నీరు దిగువకు విడుదల చేయడంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలసంద్రంగా మారాయి.

  • ఎమ్మెల్యే రాజాసింగ్ అలక

సంచలనాత్మక, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​.. ఇప్పుడు అలక మంచం ఎక్కారు. తెరాస నేతలపై విమర్శలు, కేటీఆర్​పై సెటైర్లు, బుల్డోజర్ల కామెంట్లతో హల్​చల్​ చేసే.. రాజాసింగ్​ అలకకు కారణమేంటీ.. అసలు ఆ అలక ఎవరి మీద అనుకుంటున్నారా..?

  • ఇంటి కింద పది కోట్లు..

నక్సలైట్ల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 11మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.10కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ బాలాఘాట్​లో జరిగింది. మరో ఘటనలో ఖాండ్వా జిల్లాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

  • రైల్వేలో 'వృద్ధుల రాయితీ' పునరుద్ధరణ..

వయోవృద్ధుల రాయితీని పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనరల్‌, స్లీపర్‌ తరగతులకే రాయితీని పరిమితం చేసే ఆలోచన ఉన్నట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. 70ఏళ్లు పైబడిన వారికే రాయితీ ఇచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి.

  • లాక్​డౌన్​లో బోర్ కొట్టి విమానం తయార్..

పైలట్‌ లైసెన్స్‌ కలిగిన అశోక్‌ గతంలో టూ సీటర్‌ విమానాలను అద్దెకు తీసుకొని అందులో విహారయాత్రలు చేసేవాడు. వివాహం, అనంతరం ఇద్దరు కుమార్తెలు కలగడంతో ఆయనకు నాలుగు సీట్ల విమానం అవసరమయ్యింది. ఈ విమానాలు అద్దెకు అరుదుగా లభిస్తుండటం, అవీ పాతవి కావడంతో తానే ఓ ఫోర్‌ సీటర్‌ విమానాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇందుకు లాక్‌డౌన్‌ కాలం కలిసొచ్చింది.

  • ఐసీసీ కొత్త ఛైర్మన్​గా దాదా ఎంపిక ఖరారైనట్లేనా?

ఐసీసీ కొత్త ఛైర్మన్​గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా బోర్డు స్పందించలేదు.

  • 'బింబిసార' కొత్త ట్రైలర్‌.. కల్యాణ్​ రామ్​ అదరగొట్టేశాడుగా

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్​ నటించిన 'బింబిసార' కొత్త ట్రైలర్​ వచ్చేసింది. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.