ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@11 AM

author img

By

Published : Dec 7, 2020, 10:58 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​@11 AM
టాప్​టెన్​ న్యూస్​@11 AM
  • ఖమ్మంలో మంత్రులు..

మంత్రులు కేటీఆర్​, మహమూద్​ అలీ, పువ్వాడ అజయ్​, ప్రశాంత్​రెడ్డి.. ప్రత్యేక హెలికాప్టర్​లో ఖమ్మం చేరుకున్నారు. ఐటీ హబ్​ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వరదసాయం కోసం మీ-సేవ కేంద్రాలకు రావొద్దు

హైదరాబాద్​లో వరద బాధితులెవరూ మీ-సేవ కేంద్రాలకు రావల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 7 నుంచి వరద సాయం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెలంగాణ కరోనా అప్​డేట్​

రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,73,858కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దేశంలో కొత్తగా 32,981 కరోనా కేసులు

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా 32,981 మందికి కరోనా సోకింది. మరో 391 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆమెను ఎంతగానో ఆదరిస్తున్నారు

ఛత్తీస్​గఢ్​కు చెందిన నర్సింగ్ విద్యార్థిని ఆమె. ఓ సైనికుడిని కాపాడి కేరళ కోడలిగా అడుగుపెట్టింది. ఇప్పుడు.. అదే కేరళ నుంచి రాజకీయాల్లోకి వస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తన కథ తెలిసిన కేరళ వాసులంతా ఆమెను ఎంతగానో ఆదరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నలుగురు దుర్మరణం

రాజస్థాన్​ బిల్​వాడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లి వస్తున్న వ్యాన్​ను ట్రాలీ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాదికి కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాది రూడీ గులియానీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్రంప్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లాభాల్లో స్టాక్ మార్కెట్లు

టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజీపై పెరుగుతున్న అంచనాలు, కొవిడ్​ వ్యాక్సిన్​ ఆశల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోహ్లీ స్థానంలో అతడే సరైనోడు

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు(చివరి మూడు మ్యాచులు)​ దూరమవ్వబోతున్న టీమ్​ఇండియా సారథి కోహ్లీ స్థానంలో శుభమన్​ గిల్​ను తీసుకోవాలన్నాడు కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. అలాగే టెస్టుల్లో ఓపెనింగ్​ జోడీలో మార్పులు జరగాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'గుర్తుందా శీతాకాలం'

నటుడు సత్యదేవ్​, హీరోయిన్​ తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'గుర్తుందా శీతాకాలం' సినిమా ఏప్రిల్​ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఖమ్మంలో మంత్రులు..

మంత్రులు కేటీఆర్​, మహమూద్​ అలీ, పువ్వాడ అజయ్​, ప్రశాంత్​రెడ్డి.. ప్రత్యేక హెలికాప్టర్​లో ఖమ్మం చేరుకున్నారు. ఐటీ హబ్​ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వరదసాయం కోసం మీ-సేవ కేంద్రాలకు రావొద్దు

హైదరాబాద్​లో వరద బాధితులెవరూ మీ-సేవ కేంద్రాలకు రావల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 7 నుంచి వరద సాయం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెలంగాణ కరోనా అప్​డేట్​

రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,73,858కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దేశంలో కొత్తగా 32,981 కరోనా కేసులు

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా 32,981 మందికి కరోనా సోకింది. మరో 391 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆమెను ఎంతగానో ఆదరిస్తున్నారు

ఛత్తీస్​గఢ్​కు చెందిన నర్సింగ్ విద్యార్థిని ఆమె. ఓ సైనికుడిని కాపాడి కేరళ కోడలిగా అడుగుపెట్టింది. ఇప్పుడు.. అదే కేరళ నుంచి రాజకీయాల్లోకి వస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తన కథ తెలిసిన కేరళ వాసులంతా ఆమెను ఎంతగానో ఆదరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నలుగురు దుర్మరణం

రాజస్థాన్​ బిల్​వాడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లి వస్తున్న వ్యాన్​ను ట్రాలీ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాదికి కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాది రూడీ గులియానీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్రంప్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లాభాల్లో స్టాక్ మార్కెట్లు

టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజీపై పెరుగుతున్న అంచనాలు, కొవిడ్​ వ్యాక్సిన్​ ఆశల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోహ్లీ స్థానంలో అతడే సరైనోడు

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు(చివరి మూడు మ్యాచులు)​ దూరమవ్వబోతున్న టీమ్​ఇండియా సారథి కోహ్లీ స్థానంలో శుభమన్​ గిల్​ను తీసుకోవాలన్నాడు కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. అలాగే టెస్టుల్లో ఓపెనింగ్​ జోడీలో మార్పులు జరగాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'గుర్తుందా శీతాకాలం'

నటుడు సత్యదేవ్​, హీరోయిన్​ తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'గుర్తుందా శీతాకాలం' సినిమా ఏప్రిల్​ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.