ETV Bharat / city

ముగ్గులు.. గొబ్బెమ్మలు.. పతంగులతో ఘనంగా సంక్రాంతి

author img

By

Published : Jan 15, 2020, 11:45 PM IST

Updated : Jan 16, 2020, 7:29 AM IST

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వెళ్లివిరిసింది. తెల్లవారుజాము నుంచే యువతులు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అలంకరించారు. గంగిరెద్దుల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ఘనంగా జరిగింది.

sankranthi
sankranthi
ముగ్గులు.. గొబ్బెమ్మలు.. పతంగులతో ఘనంగా సంక్రాంతి

రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి ఘనంగా జరిగింది. తెల్లవారుజామునుంచే... యువతులు ఉత్సాహంగా ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్ స్నేహపూర్వక సంబంధాలకు నిలయమని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నారాయణగూడలో భాజపా నాయకులు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా గంగిరెద్దులతో నృత్యం చేశారు. భాజపా నేత శ్రీధర్ ఇంటింటికీ తిరుగుతూ... ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కైలాసగిరి వ్రతం నిర్వహించారు. వ్రతంలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించి భోగిపళ్లు వేశారు. కరీంనగర్‌లో యువతులు రంగురంగుల రంగవల్లికలు వేసి... నవధాన్యాలు, పూలతో అలంకరించారు.

జగిత్యాలలో తెల్లవారుజామునుంచే యువతులు ముగ్గులు వేసి పండుగకు స్వాగతం పలికారు. ముగ్గుల ద్వారా సంక్రాంతి విశిష్ఠతను తెలియజేస్తూ... పండుగ జరుపుకున్నారు. జహీరాబాద్‌లో సంక్రాంతి సందర్భంగా వేసిన మోదీ ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జనగామ జిల్లా ఇప్పగూడెంలో పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏకరూప దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. చిన్నారుల నృత్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ఇదీ చూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్

ముగ్గులు.. గొబ్బెమ్మలు.. పతంగులతో ఘనంగా సంక్రాంతి

రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి ఘనంగా జరిగింది. తెల్లవారుజామునుంచే... యువతులు ఉత్సాహంగా ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్ స్నేహపూర్వక సంబంధాలకు నిలయమని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నారాయణగూడలో భాజపా నాయకులు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా గంగిరెద్దులతో నృత్యం చేశారు. భాజపా నేత శ్రీధర్ ఇంటింటికీ తిరుగుతూ... ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కైలాసగిరి వ్రతం నిర్వహించారు. వ్రతంలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించి భోగిపళ్లు వేశారు. కరీంనగర్‌లో యువతులు రంగురంగుల రంగవల్లికలు వేసి... నవధాన్యాలు, పూలతో అలంకరించారు.

జగిత్యాలలో తెల్లవారుజామునుంచే యువతులు ముగ్గులు వేసి పండుగకు స్వాగతం పలికారు. ముగ్గుల ద్వారా సంక్రాంతి విశిష్ఠతను తెలియజేస్తూ... పండుగ జరుపుకున్నారు. జహీరాబాద్‌లో సంక్రాంతి సందర్భంగా వేసిన మోదీ ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జనగామ జిల్లా ఇప్పగూడెంలో పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏకరూప దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. చిన్నారుల నృత్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ఇదీ చూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్

Last Updated : Jan 16, 2020, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.