ETV Bharat / city

'తేలియాడే సోలార్​ ప్లాంటు ఏర్పాటుకు ఎల్​ఎండీ సానుకూలం' - singareni solar power plant news

హైదరాబాద్ సింగరేణి భవన్​లో తెలంగాణ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో సింగరేణి సంస్థ డైరెక్టర్​ డి. సత్యనారాయణ సమావేశమయ్యారు. రాష్ట్రంలో 350 మెగావాట్ల ఎసీ (500 మెగావాట్ల డీసీ) సామర్థ్యంతో నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటులు ఏర్పాటు చేయడానికి 3 జలాశయాలపై అధ్యయనం చేశామని అధికారులు వివరించారు. దాని కోసం కరీంనగర్​లోని ఎల్​ఎండీ సానుకూలమని పేర్కొన్నారు.

singareni solar meeting with transco officials in hyderabad
singareni solar meeting with transco officials in hyderabad
author img

By

Published : Dec 11, 2020, 7:43 PM IST

సింగరేణి సౌర విద్యుత్, సరఫరా, వినియోగం, బిల్లింగ్‌, తదితర అంశాలపై తెలంగాణ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో ఆ సంస్థ డైరెక్టర్‌(ఈఎం) డి.సత్యనారాయణ రావు హైదరాబాద్ సింగరేణి భవన్​లో సమావేశమయ్యారు. ట్రాన్స్​కో సేవలను ప్రత్యక్షంగా కానీ... పరోక్షంగా కానీ... సింగరేణి వినియోగిస్తున్నందున కొన్ని ఛార్జీలను సంస్థ చెల్లించాల్సి ఉంటుందని సత్యనారాయణకు ఉన్నతాధికారులు వివరించారు. ట్రాన్స్​కో సబ్​స్టేషన్లు, లైన్ల వినియోగానికి, ఓపెన్‌ యాక్సెస్​కు అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు.

సింగరేణి సోలార్‌ ప్లాంటు, అనుసంధానం చేయనున్న ప్రదేశాలు, సింగరేణి విద్యుత్తు అవసరాలు, ట్రాన్స్‌ కో ద్వారా లేదా నేరుగా సింగరేణి లైన్ల ద్వారా సోలార్‌ విద్యుత్​ వినియోగం, బిల్లింగ్​పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 350 మెగావాట్ల ఎసీ (500 మెగావాట్ల డీసీ) సామర్థ్యంతో నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటులు ఏర్పాటు చేయడానికి 3 జలాశయాలపై అధ్యయనం చేశామన్నారు.

లోయర్‌ మిడ్‌ మానేరు ప్రాజెక్టు (కరీంనగర్‌) సానుకూలంగా ఉంటుందని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ రామక్రిష్ణ వివరించారు. పూర్తిస్థాయి నీరు నిండినపుడు దాదాపు 82 చదరపు కిలోమీటర్ల నీటి విస్తీర్ణం ఉండే ఈ జలాశయంలో తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కేవలం 12.5 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం సరిపోతుందని తెలిపారు. నిర్మాణం వ్యయం, అందుకు పట్టే సమయం, నిర్మాణానికి గల అనుకూలతలు మొదలైన విషయాలపై డైరెక్టర్‌ డి.సత్యనారాయణ రావు లోతుగా చర్చించారు. త్వరలో సీఎండీ ఎన్‌. శ్రీధర్​కు నివేదించనున్నామని.. ఆయన ఆదేశంపై తదుపరి కార్యచరణ చేపడుతామని డైరెక్టర్‌(ఈఎం) తెలిపారు.

ఇదీ చూడండి: కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

సింగరేణి సౌర విద్యుత్, సరఫరా, వినియోగం, బిల్లింగ్‌, తదితర అంశాలపై తెలంగాణ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో ఆ సంస్థ డైరెక్టర్‌(ఈఎం) డి.సత్యనారాయణ రావు హైదరాబాద్ సింగరేణి భవన్​లో సమావేశమయ్యారు. ట్రాన్స్​కో సేవలను ప్రత్యక్షంగా కానీ... పరోక్షంగా కానీ... సింగరేణి వినియోగిస్తున్నందున కొన్ని ఛార్జీలను సంస్థ చెల్లించాల్సి ఉంటుందని సత్యనారాయణకు ఉన్నతాధికారులు వివరించారు. ట్రాన్స్​కో సబ్​స్టేషన్లు, లైన్ల వినియోగానికి, ఓపెన్‌ యాక్సెస్​కు అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు.

సింగరేణి సోలార్‌ ప్లాంటు, అనుసంధానం చేయనున్న ప్రదేశాలు, సింగరేణి విద్యుత్తు అవసరాలు, ట్రాన్స్‌ కో ద్వారా లేదా నేరుగా సింగరేణి లైన్ల ద్వారా సోలార్‌ విద్యుత్​ వినియోగం, బిల్లింగ్​పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 350 మెగావాట్ల ఎసీ (500 మెగావాట్ల డీసీ) సామర్థ్యంతో నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటులు ఏర్పాటు చేయడానికి 3 జలాశయాలపై అధ్యయనం చేశామన్నారు.

లోయర్‌ మిడ్‌ మానేరు ప్రాజెక్టు (కరీంనగర్‌) సానుకూలంగా ఉంటుందని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ రామక్రిష్ణ వివరించారు. పూర్తిస్థాయి నీరు నిండినపుడు దాదాపు 82 చదరపు కిలోమీటర్ల నీటి విస్తీర్ణం ఉండే ఈ జలాశయంలో తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కేవలం 12.5 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం సరిపోతుందని తెలిపారు. నిర్మాణం వ్యయం, అందుకు పట్టే సమయం, నిర్మాణానికి గల అనుకూలతలు మొదలైన విషయాలపై డైరెక్టర్‌ డి.సత్యనారాయణ రావు లోతుగా చర్చించారు. త్వరలో సీఎండీ ఎన్‌. శ్రీధర్​కు నివేదించనున్నామని.. ఆయన ఆదేశంపై తదుపరి కార్యచరణ చేపడుతామని డైరెక్టర్‌(ఈఎం) తెలిపారు.

ఇదీ చూడండి: కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.