ETV Bharat / city

చైతూ ఫొటో షేర్​ చేసిన సమంత.. ఇప్పటికి మూడేళ్లంటూ..!

author img

By

Published : Apr 6, 2022, 8:36 AM IST

చైతూ ఫొటో షేర్​ చేసిన సమంత.. ఇప్పటికి మూడేళ్లంటూ..!
చైతూ ఫొటో షేర్​ చేసిన సమంత.. ఇప్పటికి మూడేళ్లంటూ..!

08:26 April 06

చైతూ ఫొటో షేర్​ చేసిన సమంత.. ఇప్పటికి మూడేళ్లంటూ..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత, నాగచైతన్య విడాకుల విషయాన్ని ఇద్దరి అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా సామ్​-చైకి సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇద్దరు మళ్లీ కలవబోతున్నారని, అందుకోసం ఒక డైరెక్టర్​ తెగ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్​ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

సమంత ఏం చేసిందంటే..?

విడాకుల అనంతరం తొలిసారి సమంత నాగచైతన్య ఫొటోను షేర్ చేసింది. చైతూ-సామ్ కలిసి నటించిన ప్రేమకథా చిత్రం 'మజిలీ' విడుదలై 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా '3 ఇయర్స్ ఆఫ్ మజిలీ' అంటూ ఇన్​స్టాలో ఆ సినిమా పోస్టర్​ను షేర్ చేసింది. విడాకుల తర్వాత తొలిసారిగా సామ్.. చైతూ పోస్టర్ షేర్ చేయడంతో.. కాసేపట్లోనే ఆ పోస్ట్​ నెట్టింట వైరల్​గా మారింది. ఇది చూసిన నెటిజన్లు చై-సామ్​ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారా అంటూ చర్చలు మొదలెట్టారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

'ఏ మాయ చేసావే' సినిమాతో మొట్టమొదటిసారిగా కలిసి నటించిన నాగచైతన్య, సమంత జంట.. వెండితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు కలిసి నటించిన 'ఆటోనగర్​ సూర్య', 'మనం', 'మజిలీ' సినిమాలు సగటు సినిమా అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాయి. విడాకులకు ముందు సమంత లీడ్​ రోల్​లో నంటించిన 'ఓ బేబీ' సినిమాలో చై అతిథి పాత్రలో మెరిశారు.

ఇదీ చూడండి: ఏంటీ..! సమంత- నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా?

08:26 April 06

చైతూ ఫొటో షేర్​ చేసిన సమంత.. ఇప్పటికి మూడేళ్లంటూ..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత, నాగచైతన్య విడాకుల విషయాన్ని ఇద్దరి అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా సామ్​-చైకి సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇద్దరు మళ్లీ కలవబోతున్నారని, అందుకోసం ఒక డైరెక్టర్​ తెగ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్​ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

సమంత ఏం చేసిందంటే..?

విడాకుల అనంతరం తొలిసారి సమంత నాగచైతన్య ఫొటోను షేర్ చేసింది. చైతూ-సామ్ కలిసి నటించిన ప్రేమకథా చిత్రం 'మజిలీ' విడుదలై 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా '3 ఇయర్స్ ఆఫ్ మజిలీ' అంటూ ఇన్​స్టాలో ఆ సినిమా పోస్టర్​ను షేర్ చేసింది. విడాకుల తర్వాత తొలిసారిగా సామ్.. చైతూ పోస్టర్ షేర్ చేయడంతో.. కాసేపట్లోనే ఆ పోస్ట్​ నెట్టింట వైరల్​గా మారింది. ఇది చూసిన నెటిజన్లు చై-సామ్​ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారా అంటూ చర్చలు మొదలెట్టారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

'ఏ మాయ చేసావే' సినిమాతో మొట్టమొదటిసారిగా కలిసి నటించిన నాగచైతన్య, సమంత జంట.. వెండితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు కలిసి నటించిన 'ఆటోనగర్​ సూర్య', 'మనం', 'మజిలీ' సినిమాలు సగటు సినిమా అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాయి. విడాకులకు ముందు సమంత లీడ్​ రోల్​లో నంటించిన 'ఓ బేబీ' సినిమాలో చై అతిథి పాత్రలో మెరిశారు.

ఇదీ చూడండి: ఏంటీ..! సమంత- నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.