'మీ ఆదరణే సంస్థకు బలం.. మా బస్సుల్లో ప్రయాణించండి' అని డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ ప్రయాణికులను అభ్యర్థించారు. 'అత్యంత అనుభవం ఉన్న డ్రైవర్లు, కండిషన్లో ఉన్న బస్సులు మా ప్రత్యేకత. అందుకే ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం. మిమ్మల్ని మా డ్రైవర్లు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతారు' అని డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి స్వయంగా ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ మొబైల్ మైక్లో ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
సికింద్రాబాద్లోని గురుద్వార్ బస్ స్టాప్లో మైక్లో ప్రచారం చేశారు. స్వయంగా సంస్థ సీఎండీనే రంగంలోకి దిగి ఆర్టీసీ ప్రయాణంపై ప్రచారం చేయడం వల్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గ్రామీణ ప్రాంతాల్లోనూ తల్లిపాలపై అవగాహన కల్పించాలి