ETV Bharat / city

మే 3 వరకు అన్ని ప్రయాణికుల రైళ్లు బంద్​

author img

By

Published : Apr 15, 2020, 10:33 AM IST

కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ పొడిగించిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిరైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 100 శాతం టికెట్ల రుసుం వెనక్కి ఇస్తామన్నారు.

railway department cancelled all trains due to lock down extension
మే 3 వరకు అన్ని ప్రయాణికుల రైళ్లు బంద్​

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మే 3 వరకు అన్ని ప్రయాణికుల రైళ్లతో పాటు ప్రీమియం, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌ రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి తేదీలు ప్రకటించే వరకు ముందస్తు రిజర్వేషన్లు ఉండబోవని స్పష్టంచేసింది.

రద్దైన రైళ్లకు సంబంధించిన టికెట్​ ఛార్జీలను 100 శాతం వెనక్కి ఇస్తామని తెలిపింది. ఈ-టికెట్ రీఫండ్ దానంతట అదే వినియోగదారుల ఖాతాలో జమచేయడం జరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మే 3 వరకు అన్ని ప్రయాణికుల రైళ్లతో పాటు ప్రీమియం, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌ రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి తేదీలు ప్రకటించే వరకు ముందస్తు రిజర్వేషన్లు ఉండబోవని స్పష్టంచేసింది.

రద్దైన రైళ్లకు సంబంధించిన టికెట్​ ఛార్జీలను 100 శాతం వెనక్కి ఇస్తామని తెలిపింది. ఈ-టికెట్ రీఫండ్ దానంతట అదే వినియోగదారుల ఖాతాలో జమచేయడం జరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇవీచూడండి: విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.